Indo china border: బంగారం అక్రమ రవాణా.. 108 కిలోల గోల్డ్ స్వాధీనం
- భారత్.. చైనా సరిహద్దులో భారీగా బంగారం పట్టివేత
- 108 కిలోల గోల్డ్ స్వాధీనం చేసుకున్న దళాలు
- కస్టమ్స్ అధికారులకు అప్పగిస్తామని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-చైనా సరిహద్దులో భారీగా బంగారం పట్టుబడింది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు ఇండో-చైనా సరిహద్దు సమీపంలో కిలోగ్రాము బరువున్న 108 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసినట్లు సరిహద్దు రక్షణ దళానికి చెందిన అధికారి ఒకరు తెలిపారు. భారీ మొత్తంలో స్మగ్లింగ్ చేసిన బంగారంతో పాటు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక బైనాక్యులర్, రెండు కత్తులు, కేకులు, పాలు వంటి పలు చైనీస్ ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: AP Crime: ఏపీలో దారుణం.. తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆపై హత్య..!
Also Read
- WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
21వ బెటాలియన్ దళాలు మంగళవారం మధ్యాహ్నం తూర్పు లడఖ్లోని చాంగ్తాంగ్ సబ్ సెక్టార్లో చిజ్బులే, నార్బులా, జాంగిల్, జక్లాతో సహా స్మగ్లర్ల చొరబాట్లను తనిఖీ చేయడానికి లాంగ్ రేంజ్ గస్తీని ప్రారంభించినట్లు అధికారి తెలిపారు. వాస్తవ నియంత్రణ రేఖకు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న శ్రీరాప్ల్లో స్మగ్లింగ్కు సంబంధించిన ఇన్పుట్లు ఐటీబీపీకి అందాయన్నారు. అనంతరం డిప్యూటీ కమాండెంట్ దీపక్ భట్ నేతృత్వంలోని పెట్రోలింగ్ నిర్వహించగా.. ఇద్దరు వ్యక్తులు మ్యూల్స్పై ఉండటాన్ని గమనించి తనిఖీ చేయగా గోల్డ్ బయటపడినట్లు పేర్కొన్నారు. అయితే వారు తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. వెంబడించి అరెస్టు చేసినట్లు అధికారి స్పష్టం చేశారు. మొదట వారు ఔషధ మొక్కల డీలర్లుగా పనిచేస్తున్నట్లు చెప్పినట్లు అధికారి పేర్కొన్నారు. వారి వస్తువులను సోదా చేయగా భారీ మొత్తంలో బంగారం, ఇతర వస్తువులు దొరికాయని వెల్లడించారు. ఐటీబీపీ చరిత్రలో ఇంత మొత్తంలో బంగారం దొరకడం ఇదే తొలిసారి అని.. స్వాధీనం చేసుకున్న మెటీరియల్ను కస్టమ్స్ విభాగానికి అప్పగిస్తామని అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Telangana DGP: తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్ నియామకం
తాజావార్తలు
-
Myanmar Airstrike: బౌద్ధ మఠంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడి.. 14 మంది మృతి
-
WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!