T20 Womens WorldCup: పాక్తో మ్యాచ్కు ముందు టీమిండియాకు షాక్..స్టార్ ఓపెనర్ దూరం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమెన్స్ టీ20 వరల్డ్కప్లో తొలిసారి ట్రోఫీ గెలిచి తీరాలన్న కసితో ఉన్న టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. భారత జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన గాయం కారణంగా పాకిస్తాన్తో జరగబోయే తొలి మ్యాచ్లో ఆడేది అనుమానంగా మారింది. ఇటీవల మంచి ఫామ్లో ఉన్న మంధాన.. ఈ మ్యాచ్కు అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్దలోటుగా చెప్పవచ్చు. టీ20 వరల్డ్కప్లో భాగంగా ఈ నెల 12న పాకిస్తాన్తో తొలి పోరులో తలపడనుంది హర్మన్సేన.
Also Read: Shocking: తన అంత్యక్రియలను తానే చేసుకున్న వృద్ధుడు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఫిబ్రవరి 8న బంగ్లాదేశ్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా స్మృతి ఆడలేదు. ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో స్మృతికి చేతి వేలికి గాయమైంది. ఆ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. అదేవిధంగా పాక్తో జరిగే మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఆడేది కూడా అనుమానంగా మారింది. సఫారీతో జరిగిన ముక్కోణపు సిరీస్ చివరి మ్యాచ్లో హర్మన్ప్రీత్ భుజానికి గాయమైంది. ఆమె ఇంకా పూర్తిగా ఫిట్గా లేదని సమాచారం. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు పాక్తో మ్యాచ్ నుంచి తప్పుకొంటే టీమిండియాకు కష్టాలు తప్పవు. “స్మృతి మంధాన ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడింది. ఆమె ప్రపంచకప్కు దూరమైందని చెప్పలేం. కానీ పాకిస్తాన్తో మ్యాచ్కు దూరమయ్యే అవకాశం ఉంది” అని ఐసీసీ వర్గాలు పీటీఐకి తెలిపాయి.
Also Read: INDvsAUS 1st Test: తొలిటెస్టులో టీమిండియా పైచేయి..వైరల్ అవుతున్న మీమ్స్
ఈ టీ20 ప్రపంచ కప్లో భారత మహిళల జట్టు గ్రూప్-బిలో ఉంది. ఫిబ్రవరి 12న పాక్ మహిళల జట్టుతో వరల్డ్ కప్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఫిబ్రవరి 15న వెస్టిండీస్తో తలపడనుంది. ఫిబ్రవరి 18న ఇంగ్లండ్తో, ఫిబ్రవరి 20న ఐర్లాండ్ మహిళల జట్టుతో తమ గ్రూప్లోని చివరి మ్యాచ్ ఆడనుంది భారత్. ఇటీవలె అండర్-19 వరల్డ్ కప్ను భారత మహిళల జట్టు గెలుచుకుని చరిత్ర సృష్టించిన విషయం తెలిసింది.
Also Read: Kabaddi: కబడ్డీ ఆటలో కూత పెడుతూ కుప్పకూలిన యువకుడు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!