Smriti Mandhana: రికార్డుల రారాణి స్మృతి మంధాన.. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో 10,000 పరుగులు పూర్తి..!
- మహిళల అంతర్జాతీయ క్రికెట్లో 10,000 పరుగులు పూర్తి చేసిన స్మృతి మంధాన
- ఈ ఘనత సాధించిన నాలుగో మహిళా క్రికెటర్గా మంధాన
- భారత్ తరఫున ఈ జాబితాలో మిథాలీ రాజ్ తర్వాత రెండో మహిళ స్మృతి.
- మిథాలీ రాజ్ (10,868), సుజీ బేట్స్ (10,652), షార్లెట్ ఎడ్వర్డ్స్ (10,273) మంధాన కంటే ముందు.
Smriti Mandhana: తిరువనంతపురం వేదికగా జరుగుతున్న భారత్, శ్రీలంక నాలుగో టీ20లో టీమిండియా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మరో చారిత్రక మైలురాయిని చేరుకుంది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో 10,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా మంధాన నిలిచింది. ఈ ఘనత సాధించిన రెండో భారత మహిళా. భారత్ తరఫున ఈ జాబితాలో మిథాలీ రాజ్ 10,868 పరుగులతో ముందుంది. సుజీ బేట్స్ (న్యూజిలాండ్) 10,652 పరుగులు, షార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్) 10,273 పరుగులతో మంధాన కంటే ముందున్నారు.
LG 5K Monitor: టీవీని మించిన ‘మినీ’ విజువల్.. 5K మెరుపులతో LG మానిటర్ వస్తుంది!
Also Read
స్మృతి మంధాన ఈ మైలురాయిని కేవలం 281 ఇన్నింగ్స్లలోనే సాధించింది. ఈ ఘనతను అత్యంత వేగంగా చేరుకున్న మహిళగా రికార్డు సృష్టించింది. ఈ రికార్డును మిథాలీ రాజ్ 291 ఇన్నింగ్స్, షార్లెట్ ఎడ్వర్డ్స్ 308 ఇన్నింగ్స్, సుజీ బేట్స్ 314 ఇన్నింగ్స్ లలో సాధించారు. తిరువనంతపురంలో జరిగిన భారత్, శ్రీలంక నాలుగో టీ20 మ్యాచ్ కు ముందు మంధాన 10,000 పరుగులకు 27 పరుగుల దూరంలో ఉంది. మ్యాచ్లో నిమాషా మీపేజ్ బౌలింగ్లో లాంగ్-ఆన్ వైపు సింగిల్ తీసి ఆమె ఈ మైలురాయిని అందుకుంది.
TTD Alert: వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో భారీ బందోబస్తు..!
2025 ఏడాది మంధానకు అద్భుతమైన సంవత్సరం అని చెప్పాలి. ఇటీవల ముగిసిన మహిళల వన్డే వరల్డ్ కప్ విజయంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఒక క్యాలెండర్ ఇయర్లో 1000 వన్డే పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్ గా రికార్డ్ సాధించింది. 2025లో 1362 వన్డే పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. ఈ ఏడాది 5 వన్డే సెంచరీలు సాధించింది. మరోవైపు టీ20ల విషయానికి వస్తే.. ఈ సిరీస్లోనే మంధాన మహిళల టీ20 అంతర్జాతీయాల్లో 4,000 పరుగులు పూర్తి చేసిన రెండో మహిళగా నిలిచింది. ఈ జాబితాలో ముందున్నది సుజీ బేట్స్ (4,716 పరుగులు) మాత్రమే ముందుంది. ఇక నాలుగో టీ20లో మంధాన అద్భుతంగా ఆడి 48 బంతుల్లో 80 పరుగులు చేసింది. ఆమెతో పాటు షెఫాలి వర్మ (79) కూడా మెరుపులు మెరిపించడంతో భారత్ 20 ఓవర్లలో 221/2 భారీ స్కోరు నమోదు చేసింది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!