Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: ఉమ్మడి కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. రైల్వే కోడూరు నియోజకవర్గ ఓబులవారిపల్లె మండలం చిన్న వరంపాడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.. మరో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాలు పాలయ్యారు. తిరుపతి నుండి కడప వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును చిన్న వారంపాడు వద్ద చెన్నై వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ఇక, ఘటనలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మార్గమధ్యంలో మృతి చెందారు.. బస్సులో ప్రయాణిస్తున్న మరో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో విషయం తెలుసుకున్న ఓబులవారిపల్లె పోలీసులు.. హుటాహుటిన ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు.. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక, ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also: Pawan Kalyan: ఇది రాజ్యాంగ ఉల్లంఘనే.. సీఈసీ చర్యలు తీసుకోవాలి..
Also Read
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!