Pawan Kalyan: ఇది రాజ్యాంగ ఉల్లంఘనే.. సీఈసీ చర్యలు తీసుకోవాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: వాలంటీర్ వ్యవస్థపై సంచలన ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏ అవకాశం దొరికినా.. ఆ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు.. తాజాగా, ఆంధ్రప్రదేశ్లో ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం ప్రారంభం అయ్యింది.. అయితే, వాలంటీర్లు ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొనడాన్ని తప్పు పడుతూ జనసేనాని ట్వీట్ చేశారు.. ఓటరు జాబితా తయారీ నుంచి ఫలితాల ప్రకటన వరకు ఎన్నికల ప్రక్రియ. నిష్పక్షపాతంగా.. పారదర్శకంగా జరగాలని కోరిన ఆయన.. ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలిచ్చినా.. రాష్ట్ర వ్యాప్తంగా బీఎల్ఓలతో ఏపీ వాలంటీర్లు ఇంటింటికి సర్వే ప్రక్రియలో భాగమవుతున్నారని విమర్శించారు.. ఇది రాజ్యాంగ ఉల్లంఘన.. ఏపీలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది.. దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని సీఈసీని జనసేన డిమాండ్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు పవన్.. ఇక, ఓటర్ వెరిఫికేషన్లో ఏపీలో వాలంటీర్లు పాల్గొంటున్నారంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను తన ట్వీట్లో జత చేశారు పవన్ కల్యాణ్.
Read Also: Husband Caught Wife Cheating: ఢిల్లీ మెట్రోలో ప్రియుడితో అడ్డంగా దొరికిన భార్య.. రివర్స్లో దాడి
Also Read
- Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
ఇక, అంతకు ముందు.. బైజూస్ ట్యాబ్ల వ్యవహారంపై కూడా ట్వీట్ చేశారు పవన్?. బైజూస్ సంస్థ నష్టాల్లో ఉందన్న కథనాలను ట్యాగ్ చేసిన పవన్.. పీఎంవో, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు తన ట్వీట్ని ట్యాగ్ చేస్తూ.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదు.. టీచర్ రిక్రూట్మెంట్ లేదు.. టీచర్ ట్రైనింగ్ లేదు.. నష్టాలు వచ్చే స్టార్టప్కి కోట్లలో కాంట్రాక్టులు వస్తాయి.. వైసీపీ ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్ను పాటించిందా..? ట్యాబు పంపిణీ కోసం ఎన్ని కంపెనీలు టెండర్లు దరఖాస్తు చేశాయి..? ఎవరు షార్ట్ లిస్ట్ చేశారు..? ఇది పబ్లిక్ డొమైన్లో ఉందా? దీనిపై వైసీపీ ప్రభుత్వం స్పందించాలంటూ ట్వీట్ చేశారు. ట్యాబ్లు మంచివే.. కానీ, ముందుగా పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించండి అని సూచించారు. యాప్ల కన్నా.. ముందు ఉపాధ్యాయుడు తప్పని సరిగా ఉండేలా చూడండి అంటూ ట్వీట్ ద్వారా వైఎస్ జగన్ సర్కార్కు సూచించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
-
Regina Cassandra : హీరోయిన్ నుండి విలన్ పాత్రలకు షిఫ్ట్ అయిన రెజీనా కాసాండ్రా
-
OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
-
Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
-
Karthi30: ‘మార్షల్’ కంటే ముందే ‘కార్తి30’ పూర్తి?.. షూటింగ్ షెడ్యూల్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!