TSPSC : పేపర్ లీక్ లో నిందితుల ఆర్ధిక లావాదేవీలపై సిట్ ఆరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ బృందం ఆరా తీస్తుంది. క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో నిందితులను సిట్ కస్టడికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 18 నుంచి నిందితులను సిట్ టీమ్ ప్రశ్నిస్తుంది. ఇవాళ రెండో రోజున సిట్ అధికారులు నిందితులను విచారిస్తున్నారు. 2022 అక్టోబర్ నెల నుంచి జరిగిన ఏడు పరీక్షలపై కూడా సిట్ టీమ్ ఫోకస్ పెట్టింది. ఈ ఏడు పరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నజర్ పెట్టింది. ఈ ఏడు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఏమైనా లీయయ్యాయా అనే కోణంలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Shocking: పెళ్లి చేసుకుని ఆరేళ్లయింది.. ఇద్దరు పిల్లలు.. ఇప్పుడు వారిద్దరూ అన్నాచెల్లెళ్లు
Also Read
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఏడు పరీక్షలను తెలంగాణ పబ్లీకి సర్వీస్ కమిషన్ నిర్వహించింది. ఫుడ్ సేప్టీ ఆఫీసర్, సీపీడీఓ, సూపర్ వైజర్ గ్రేడ్2, ఏఈఈ, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, ఏఈ పరీక్షలు నిర్వహించారు. అయితే ఇప్పటికే ఏఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైందని సిట్ టీమ్ గుర్తించింది. మిగిలిన పరీక్షలు జరిగిన తీరుపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ,డీఏఓ పరీక్షలను రద్దు చేస్తున్నట్లుగా తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ రెండు రోజుల క్రితం ప్రకటించింది.
Also Read : Punjab: అస్సాంకు అమృత్పాల్ సింగ్ అనుచరులను..భయానక వాతావరణం సృష్టించొద్దన్న సిక్కు సంస్థ
ఈ నెల 5వ తేదీన జరిగిన ఏఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రంతో పాటు మరో నాలుగు ప్రశ్నాపత్రాలను కూడా ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో డౌన్ లోడ్ చేసుకున్నారని సిట్ టీమ్ గుర్తించింది. పేపర్ లీక్ కేసులో ప్రవీణ్, రాజశేఖర్ లు కీలకంగా వ్యవహరించినట్లుగా సిట్ టీమ్ గుర్తించింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన రేణుక కొందరికి ఈ పేపర్ ను విక్రయించినట్లుగా పోలీసులు గుర్తించారు. పేపర్ లీక్ కేసులో లావాదేవీల విషయంలో చోటు చేసుకున్న విభేదాల కారణంగానే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు గుర్తించారు.
- Tags
- Crime News
- police
- SIT
- telangana
- tspsc
తాజావార్తలు
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
-
New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!