CM Revanth Reddy : ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది
- సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో తీవ్ర విషాదం
- స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- సింహాచలం ఆలయంలో భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించింది : సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిజరూప దర్శనం కోసం వేచి ఉన్న భక్తులపై అకస్మాత్తుగా గోడ కూలడంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన భక్తులను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటన భక్తజనంలో తీవ్ర ఆవేదనకు కారణమైంది. విషాదకర ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. “ఆంధ్ర ప్రదేశ్ లోని సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.” అని అన్నారు. విశాఖపట్నం జిల్లాలో ఘనంగా జరుగుతున్న చందనోత్సవం సందర్భంగా స్వామివారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు.
దీనికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వందలాది మంది భక్తులు రూ.300 క్యూలైన్లో నిల్చొని స్వామి దర్శనానికి వేచి ఉన్న సమయంలో, రాత్రి సమయంలో కురిసిన భారీ వర్షంతో ఆలయం ప్రాంగణంలోని ఓ గోడ కూలిపోయింది. తెల్లవారు జామున 3 గంటల సమయంలో గోడ కూలినట్టు సమాచారం. ప్రమాద సమయంలో క్యూలైన్లలో ఉన్న భక్తులు ఎటువైపు వెళ్లాలనే అప్రతిష్ఠ పరిస్థితుల్లో చిక్కుకున్నారు. గోడ నేరుగా వారి తలలపై పడిన కారణంగా మృతదేహాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే NDRF బృందాలు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. మృతదేహాలను బయటకు తీశారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలానిక చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
Also Read
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!