Shreyas Iyer Health Update: శ్రేయస్ అయ్యర్కు సర్జరీ.. ఇప్పుడెలా ఉన్నారంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer Health Update: ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన మూడో వన్డే సందర్భంగా.. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారీ క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో అయ్యర్ కింద పడిపోయాడు. ఈ సంఘటనలో శ్రేయస్ ప్లీహానికి గాయమైంది. అనంతరం ఆయనను సిడ్నీలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షలో అయ్యర్కు స్వల్ప అంతర్గత రక్తస్రావం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. తాజాగా శ్రేయస్ అయ్యర్ శస్త్రచికిత్సకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది.
READ ALSO: Bihar Election 2025: మహాఘట్ బంధన్ మేనిఫెస్టో విడుదల.. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం
Also Read
- Fake Doctors: హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
విజయవంతంగా శ్రేయాస్కు శస్త్రచికిత్స..
శ్రేయస్ అయ్యర్ ప్లీహానికి అయిన గాయానికి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి అయ్యింది. ఇప్పుడు అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని వైద్యులు చెప్పారు. పలు నివేదికల ప్రకారం.. ప్రస్తుతం శ్రేయస్అయ్యర్ పరిస్థితి పూర్తి స్థిరంగా ఉందని, శ్రేయస్ ఐసీయూ నుంచి విడుదలయ్యాడు. వైద్యులు మాట్లాడుతూ.. శ్రేయస్కు జరిగింది ఒక చిన్న శస్త్రచికిత్స అని, కానీ అయ్యర్ కనీసం ఐదు రోజులు, గరిష్టంగా ఒక వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయ్యర్ పరిస్థితి వేగంగా మెరుగుపడుతోందని చెప్పారు. ప్రస్తుతం అయ్యర్ను జనరల్ వార్డుకు తరలించినట్లు వెల్లడించారు. ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్తారని వైద్యులు చెప్పారు. సిడ్నీలో ఆయన గాయాన్ని బీసీసీఐ వైద్య బృందం కూడా నిశితంగా పరిశీలిస్తోంది.
ఫీల్డ్కి రావడానికి ఎంత టైం పడుతుంది..
శ్రేయాస్ అయ్యర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత భారతదేశానికి తిరిగి రానున్నాడు. అయితే అయ్యర్ తిరిగి మైదానంలోకి రావడానికి నాలుగు నుంచి ఆరు వారాలు పట్టవచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు. ఈక్రమంలో నవంబర్ 30 నుంచి ఇండియాలో జరగే భారత్ – దక్షిణాఫ్రికా వన్డే సిరీస్కు శ్రేయస్ అయ్యర్ దూరమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. పీకేకి ఓటర్ ఐడీ పోటు.. రంగంలోకి ఈసీ!
తాజావార్తలు
-
Fake Doctors: హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
-
YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
-
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!