Shreyas Iyer: ‘శ్రేయస్ అయ్యర్ అలాంటి వాడు అనుకోలేదు’.. అన్నీ అబద్ధాలే.. ఏం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లాండ్తో జరిగిన టీ-20 సిరీస్ ఓటమి అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ‘ టీమిండియా జట్టు మార్పుల దశలో ఉంది(ట్రాన్సిషన్)’ అని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. యువ ఆటగాళ్ల వల్ల తప్పులు జరుగుతాయని, వాటి నుండి నేర్చుకుంటామని ఆయన సమర్థించుకున్నారు. అయితే.. ఈ ప్రకటన వాస్తవాలకు దూరంగా ఉందనేది స్పష్టమవుతోంది.
ప్రస్తుత భారత జట్టు స్క్వాడ్ను నిశితంగా పరిశీలిస్తే.. కేవలం ముగ్గురు (వైభవ్ సూర్యవంశీ, ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ శెడ్గే) మాత్రమే కొత్త ఆటగాళ్లు. వీరిలో శెడ్గేకు ఇంకా ఆడే అవకాశం రాలేదు. ప్రిన్స్ యాదవ్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ మంచి ప్రదర్శన చేశాడు. మిగిలిన జట్టు అంతా ఎంతో అనుభవజ్ఞులతో కూడినదే.
Also Read
- CWG 2026 Medals: ఒక్క రోజులో 16 పతకాలు.. పాయింట్స్ పట్టికలో ఆరు స్థానాలు ఎగబాకిన భారత్.!
- Secunderabad: పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు.. ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు ప్రారంభం
- Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
- Friendship Day 2026: ఒక బ్యాండ్.. ఎన్నో జ్ఞాపకాలు.. అసలు స్నేహితుల దినోత్సవం చరిత్ర తెలుసా?
ఆటగాళ్ల అనుభవాన్ని చూస్తే.. అక్షర్ పటేల్ 100 మ్యాచ్లు, అర్ష్దీప్ సింగ్ 90 మ్యాచ్లు, శివమ్ దూబే 70 మ్యాచ్లు, సంజూ శాంసన్ 65 మ్యాచ్లు, వాషింగ్టన్ సుందర్ 62 మ్యాచ్లు, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్) 57 మ్యాచ్లు, తిలక్ వర్మ 55 మ్యాచ్లు, అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ చెరి 50 కి పైగా మ్యాచ్లు, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ దాదాపు 50 మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి కొందరు సీనియర్లు ఈ సిరీస్లో లేనప్పటికీ, జట్టులోకి వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా వంటి వారు కూడా అంతర్జాతీయ క్రికెట్ ఆడినవారే.
ఒక తరం నుండి మరో తరానికి మారడాన్ని ‘ట్రాన్సిషన్’ అంటారు. కానీ ఇక్కడ ఆడుతున్న ప్లేయింగ్ XI లో మెజారిటీ ఆటగాళ్లు పాతవారే. సీనియర్ ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడమే సిరీస్ ఓటమికి ప్రధాన కారణం. కాబట్టి, ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి “జట్టు మార్పుల దశలో ఉంది” అని శ్రేయస్ అయ్యర్ చెప్పిన మాటలు కేవలం సాకులుగానే కనిపిస్తున్నాయి తప్ప, అందులో ఎలాంటి నిజం లేదు. యువ ఆటగాళ్లను నెపంగా చూపి సీనియర్లు తమ వైఫల్యాలను దాచలేరని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
Ghattamaneni Aadiseshagirirao : పద్మాలయ స్టూడియోస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే భాద్యత జై కృష్ణపై ఉంది
-
CWG 2026 Medals: ఒక్క రోజులో 16 పతకాలు.. పాయింట్స్ పట్టికలో ఆరు స్థానాలు ఎగబాకిన భారత్.!
-
Kangana Ranaut: “మంటకు ఆజ్యం పోయవద్దు!” హృతిక్పై విరుచుకుపడిన కంగనా రనౌత్
-
CWG 2026: కామన్వెల్త్ గేమ్స్లో అదరగొడుతున్న భారత్.. 39 పతకాలతో టాప్-4లోకి ఇండియా!
-
Secunderabad: పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు.. ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు ప్రారంభం
ట్రెండింగ్
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!