Gang Rape Case: “అంతా ప్లాన్ ప్రకారమే”.. కోల్కతా గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు..
- కోల్కతాలోని లా కాలేజీలో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
- ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం
- ముగ్గురు నిందితుల గురించి సంచలన విషయలు వెల్లడి
- అత్యాచారానికి ముందుగానే ప్లాన్ చేసినట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలోని లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. అరెస్టయిన నలుగురిలో ముగ్గురు ముందుగానే ప్లాన్ వేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసులో నాల్గవ నిందితుడు కళాశాల సెక్యూరిటీ గార్డు. “ఈ అత్యాచారం ఘటనను ఈ ముగ్గురు ముందుగానే ప్లాన్ వేశారు. బాధితురాలిపై దాడికి ఒడిగట్టడానికి ఈ ముగ్గురూ చాలా రోజులుగా కుట్ర పన్నారు. బాధితురాలు కళాశాలలో అడ్మిషన్ పొందిన మొదటి రోజు నుంచే ప్రధాన నిందితుడు ఆమెను లక్ష్యంగా చేసుకున్నట్లు మేము కనుగొన్నాం” అని ప్రత్యేక దర్యాప్తు బృందంలోని ఓ అధికారి వెల్లడించారు.
READ MORE:J-K: పహల్గాం తరహాలో భారీ ప్లాన్..? భారత్లోకి చొరబడేందుకు ఉగ్రవాదుల యత్నం..
Also Read
- ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP).. కేంద్రానికి కోర్టు నోటీసులు జారీ..!
- Supreme Court: హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు.. ఆలస్యం వద్దు..!
- TGSRTC JAC: ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలకు సిద్ధమైన జేఏసీ
- Indian Railways Food Prices: రైల్వే ప్రయాణికులకు షాక్.. వాటి ధరల పెంపు.! జూన్ 1 నుంచి అమల్లోకి..
తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం ( SIT) ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఓ జాతీయ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. ముగ్గురు నిందితులైన మోనోజిత్ మిశ్రా, ప్రతిమ్ ముఖర్జీ, జైద్ అహ్మద్ గతంలో అదే కళాశాలలోని ఇతర విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు సిట్ కనుగొంది. ఈ ముగ్గురు నిందితులు టార్గెట్ చేసి యువతులపై అసభ్యంగా ప్రవర్తించే వారు. తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి.. అనంతరం ఆ ఫుటేజీని చూయించిబాధితులను బ్లాక్ మెయిల్ చేసేవారు. కోల్కతా పోలీసులు ఇప్పుడు నిందితులు రికార్డ్ చేసిన మొబైల్ వీడియోల కోసం శోధిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ముఖర్జీ, అహ్మద్ నివాసాలలో సోదాలు జరిగాయి. జూన్ 25న జరిగిన అత్యాచారానికి సంబంధించిన వీడియో క్లిప్ ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఆ క్లిప్లను ఫార్వార్డ్ చేశారా లేదా మరి ఏదైనా గ్రూపుల్లో పంచుకున్నారా? అని తెలుసుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని సిట్ బృందం తెలిపింది.
READ MORE: J-K: పహల్గాం తరహాలో భారీ ప్లాన్..? భారత్లోకి చొరబడేందుకు ఉగ్రవాదుల యత్నం..
తాజావార్తలు
-
Explainer: చనిపోయిన తర్వాత భారతీయుల ర*క్తాన్ని తాగుతున్నారు.. వెలుగులోకి భయంకర లెక్కలు!
-
Peddi Team Takes : ఆన్లైన్ టార్గెటెడ్ నెగిటివిటీపై ‘పెద్ది’ టీమ్ లీగల్ యాక్షన్ స్టార్ట్
-
‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP).. కేంద్రానికి కోర్టు నోటీసులు జారీ..!
-
Vaibhav vs Kohli: 2016లో విరాట్ కోహ్లీ, 2026లో వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలోనే గొప్ప..!
-
Supreme Court: హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు.. ఆలస్యం వద్దు..!
ట్రెండింగ్
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!