Gang Rape Case: “అంతా ప్లాన్ ప్రకారమే”.. కోల్కతా గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు..
- కోల్కతాలోని లా కాలేజీలో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
- ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం
- ముగ్గురు నిందితుల గురించి సంచలన విషయలు వెల్లడి
- అత్యాచారానికి ముందుగానే ప్లాన్ చేసినట్లు సమాచారం
కోల్కతాలోని లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. అరెస్టయిన నలుగురిలో ముగ్గురు ముందుగానే ప్లాన్ వేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసులో నాల్గవ నిందితుడు కళాశాల సెక్యూరిటీ గార్డు. “ఈ అత్యాచారం ఘటనను ఈ ముగ్గురు ముందుగానే ప్లాన్ వేశారు. బాధితురాలిపై దాడికి ఒడిగట్టడానికి ఈ ముగ్గురూ చాలా రోజులుగా కుట్ర పన్నారు. బాధితురాలు కళాశాలలో అడ్మిషన్ పొందిన మొదటి రోజు నుంచే ప్రధాన నిందితుడు ఆమెను లక్ష్యంగా చేసుకున్నట్లు మేము కనుగొన్నాం” అని ప్రత్యేక దర్యాప్తు బృందంలోని ఓ అధికారి వెల్లడించారు.
READ MORE:J-K: పహల్గాం తరహాలో భారీ ప్లాన్..? భారత్లోకి చొరబడేందుకు ఉగ్రవాదుల యత్నం..
Also Read
- 2 States Elections: బెంగాల్, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
- TGSRTC Strike: నేడు ఆర్టీసీ బస్సులు నడుస్తాయా? సమ్మెపై క్లారిటీ ఇచ్చిన జేఏసీ!
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం ( SIT) ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఓ జాతీయ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. ముగ్గురు నిందితులైన మోనోజిత్ మిశ్రా, ప్రతిమ్ ముఖర్జీ, జైద్ అహ్మద్ గతంలో అదే కళాశాలలోని ఇతర విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు సిట్ కనుగొంది. ఈ ముగ్గురు నిందితులు టార్గెట్ చేసి యువతులపై అసభ్యంగా ప్రవర్తించే వారు. తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి.. అనంతరం ఆ ఫుటేజీని చూయించిబాధితులను బ్లాక్ మెయిల్ చేసేవారు. కోల్కతా పోలీసులు ఇప్పుడు నిందితులు రికార్డ్ చేసిన మొబైల్ వీడియోల కోసం శోధిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ముఖర్జీ, అహ్మద్ నివాసాలలో సోదాలు జరిగాయి. జూన్ 25న జరిగిన అత్యాచారానికి సంబంధించిన వీడియో క్లిప్ ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఆ క్లిప్లను ఫార్వార్డ్ చేశారా లేదా మరి ఏదైనా గ్రూపుల్లో పంచుకున్నారా? అని తెలుసుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని సిట్ బృందం తెలిపింది.
READ MORE: J-K: పహల్గాం తరహాలో భారీ ప్లాన్..? భారత్లోకి చొరబడేందుకు ఉగ్రవాదుల యత్నం..
తాజావార్తలు
-
2 States Elections: బెంగాల్, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
-
Rishabh Pant: నా వల్లే ఓడిపోయాం.. కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన!
-
TGSRTC Strike: నేడు ఆర్టీసీ బస్సులు నడుస్తాయా? సమ్మెపై క్లారిటీ ఇచ్చిన జేఏసీ!
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?