Rajasthan: ప్రియురాలి గొంతు కోసి చంపి పాతి పెట్టిన ప్రియుడు.. కట్చేస్తే…
- రాజస్థాన్లోని ప్రతాప్గఢ్లో ఓ షాకింగ్ సంఘటన
- ప్రియురాలిని చంపి భూమిలో పాతిపెట్టిన యువకుడు
- ప్రియుడి ఇంటికి కొద్ది దూరంలో లభించిన మృతదేహం
- పరారీలో నిందితుడు.. పట్టుకునేందుకు ఓ బృందం ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని ప్రతాప్గఢ్లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రేమికుడు తన ప్రియురాలిని చంపి భూమిలో పాతిపెట్టాడు. 5 రోజులుగా కనిపించకుండా పోయిన ప్రియురాలి మృతదేహం ప్రియుడి ఇంటికి కొద్ది దూరంలో లభించింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడిని పట్టుకోవడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.
READ MORE: Off The Record: ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ ఒక్కసారిగా కూల్ అవడానికి కారణాలేంటి?
Also Read
- PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
- Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
- Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్తో కీలక భేటీలు!
- Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ 'భూవీ' ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!
ఈ సంఘటన రాష్ట్రంలోని ప్రతాప్గఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. పర్సోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆద్ గ్రామానికి చెందిన ఖానియా మీనా కుమార్తె భూలా మీనా (19) జూన్ 12న భర్కుండిలోని తన సోదరి ఇంటికి వెళ్లింది. రాత్రి భూలా మీనా తన సోదరి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. విషయం తెలిసిన కుటుంబీకులు వెతకడం మొదలు పెట్టారు. చుట్టుపక్కల విచారించగా, ఆమె పాట్ల బావ్ది నివాసి అయిన లఖ్మా అలియాస్ కన్హయ్య మీనాతో చాలా కాలంగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు వెల్లడైంది. ఆ యువతి అతడి వెంట పారిపోయి ఉంటుందని కుటుంబీకులు అనుకున్నారు. ఈ విషయం బయటకు వస్తే తన పరువు పోతుందని భూలా తండ్రి భావించాడు.
READ MORE: Love Jihad: ఉజ్జయినిలో లవ్ జిహాద్..! హిందువునని చెప్పి యువతిని ట్రాప్ చేసిన ముస్లిం యువకుడు..!
పోలీసులకు ఎలాంటి సమాచారం అందించకుండా తామే వెతకడం ప్రారంభించారు. అతను 2 రోజులు భూలా కోసం వెతికినా.. లాభం లేకుండా పోయింది. ఆమె చివరిసారిగా కన్హయ్య మీనాతో కనిపించిందని తేలింది. కుటుంబ సభ్యులు కన్హయ్య ఇంటికి బయలు దేరారు. ఆ ఇంటికి కొంత దూరంలో దుర్వాసన రావడం ప్రారంభమైంది. వాసన వస్తున్న ప్రదేశంలో జంతువులు కూడా తిరుగుతున్నాయి. మట్టిలో పాతిపెట్టిన ఓ మనిషి చేయి కూడా కనిపించింది. దీనిపై భూలా తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రదేశాన్ని సీజ్ చేశారు. రాత్రి కావడంతో తవ్వకాలు చేపట్టలేదు. ఇంతలో, కుటుంబ సభ్యులు కొందరు కన్హయ్య ఇంటికి చేరుకోగా.. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు
READ MORE: Off The Record: వరంగల్ లో డ్యూటీ చేయడానికి పోలీసులు హడలిపోతున్నారా?
మరునాడు ఉదయం పోలీసులు తవ్వకాలు చేపట్టారు. ప్లాస్టిక్ సంచిలో ఓ మృతదేహం కనిపించింది. ఎఫ్ఎస్ఎల్ L బృందం సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని గుర్తించడం కష్టంగా మారింది. కుటుంబ సభ్యుల దుస్తులను గుర్తుపట్టి మృతదేహాన్ని భూలా మీనా (19)గా గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు కోసం పోలీసులు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల కోసం వెతుకుతున్నారు. భూలా తన ప్రేమికుడు కన్హయ్యను వివాహం కోసం ఒత్తిడి చేసిందని.. కానీ కన్హయ్య పెళ్లికి సిద్ధంగా లేడని పోలీసులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితిలో భూలాను వదిలించుకోవడానికి దుపట్టాతో ఆమెను గొంతు కోసి చంపాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అనంతరం మృతదేహాన్ని ఇంటికి సమీపంలో పాతిపెట్టి పరారయ్యాడు.
తాజావార్తలు
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kiara Advani: ఆడిషన్స్ కోసం క్యూ కట్టిన..స్టార్డమ్ ఉరికే రాలేదు
-
Mutta Kalakki : తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా జివి ప్రకాష్.. రికార్డ్స్ బద్దలు కొట్టిన ‘ముట్ట కలక్కి’
-
Virat Kohli Duck: మరోసారి విరాట్ కోహ్లీ డకౌట్.. కింగ్ను సున్నాకే పెవిలియన్కు పంపిన బౌలర్లు వీరే!
-
Lenin : అఖిల్ ‘లెనిన్’ మూవీలో స్పెషల్ రోల్ ?
ట్రెండింగ్
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత