Rajasthan: ప్రియురాలి గొంతు కోసి చంపి పాతి పెట్టిన ప్రియుడు.. కట్చేస్తే…
- రాజస్థాన్లోని ప్రతాప్గఢ్లో ఓ షాకింగ్ సంఘటన
- ప్రియురాలిని చంపి భూమిలో పాతిపెట్టిన యువకుడు
- ప్రియుడి ఇంటికి కొద్ది దూరంలో లభించిన మృతదేహం
- పరారీలో నిందితుడు.. పట్టుకునేందుకు ఓ బృందం ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని ప్రతాప్గఢ్లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రేమికుడు తన ప్రియురాలిని చంపి భూమిలో పాతిపెట్టాడు. 5 రోజులుగా కనిపించకుండా పోయిన ప్రియురాలి మృతదేహం ప్రియుడి ఇంటికి కొద్ది దూరంలో లభించింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడిని పట్టుకోవడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.
READ MORE: Off The Record: ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ ఒక్కసారిగా కూల్ అవడానికి కారణాలేంటి?
Also Read
- PM Modi: ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్గా మారింది
- Anganwadi Jobs: ఇంటర్ పాసైన మహిళలకు శుభవార్త.. అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు..
- PM Modi: ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రతిధ్వని ప్రపంచానికి వినిపించింది.. మెల్బోర్న్లో మోడీ కామెంట్స్..
- Pakistan: లిబియాలో శాంతి దూతగా పాక్.. యూఎస్-ఇరాన్ తర్వాత కొత్త మిషన్.. అసలు కారణం వేరే..
ఈ సంఘటన రాష్ట్రంలోని ప్రతాప్గఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. పర్సోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆద్ గ్రామానికి చెందిన ఖానియా మీనా కుమార్తె భూలా మీనా (19) జూన్ 12న భర్కుండిలోని తన సోదరి ఇంటికి వెళ్లింది. రాత్రి భూలా మీనా తన సోదరి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. విషయం తెలిసిన కుటుంబీకులు వెతకడం మొదలు పెట్టారు. చుట్టుపక్కల విచారించగా, ఆమె పాట్ల బావ్ది నివాసి అయిన లఖ్మా అలియాస్ కన్హయ్య మీనాతో చాలా కాలంగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు వెల్లడైంది. ఆ యువతి అతడి వెంట పారిపోయి ఉంటుందని కుటుంబీకులు అనుకున్నారు. ఈ విషయం బయటకు వస్తే తన పరువు పోతుందని భూలా తండ్రి భావించాడు.
READ MORE: Love Jihad: ఉజ్జయినిలో లవ్ జిహాద్..! హిందువునని చెప్పి యువతిని ట్రాప్ చేసిన ముస్లిం యువకుడు..!
పోలీసులకు ఎలాంటి సమాచారం అందించకుండా తామే వెతకడం ప్రారంభించారు. అతను 2 రోజులు భూలా కోసం వెతికినా.. లాభం లేకుండా పోయింది. ఆమె చివరిసారిగా కన్హయ్య మీనాతో కనిపించిందని తేలింది. కుటుంబ సభ్యులు కన్హయ్య ఇంటికి బయలు దేరారు. ఆ ఇంటికి కొంత దూరంలో దుర్వాసన రావడం ప్రారంభమైంది. వాసన వస్తున్న ప్రదేశంలో జంతువులు కూడా తిరుగుతున్నాయి. మట్టిలో పాతిపెట్టిన ఓ మనిషి చేయి కూడా కనిపించింది. దీనిపై భూలా తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రదేశాన్ని సీజ్ చేశారు. రాత్రి కావడంతో తవ్వకాలు చేపట్టలేదు. ఇంతలో, కుటుంబ సభ్యులు కొందరు కన్హయ్య ఇంటికి చేరుకోగా.. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు
READ MORE: Off The Record: వరంగల్ లో డ్యూటీ చేయడానికి పోలీసులు హడలిపోతున్నారా?
మరునాడు ఉదయం పోలీసులు తవ్వకాలు చేపట్టారు. ప్లాస్టిక్ సంచిలో ఓ మృతదేహం కనిపించింది. ఎఫ్ఎస్ఎల్ L బృందం సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని గుర్తించడం కష్టంగా మారింది. కుటుంబ సభ్యుల దుస్తులను గుర్తుపట్టి మృతదేహాన్ని భూలా మీనా (19)గా గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు కోసం పోలీసులు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల కోసం వెతుకుతున్నారు. భూలా తన ప్రేమికుడు కన్హయ్యను వివాహం కోసం ఒత్తిడి చేసిందని.. కానీ కన్హయ్య పెళ్లికి సిద్ధంగా లేడని పోలీసులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితిలో భూలాను వదిలించుకోవడానికి దుపట్టాతో ఆమెను గొంతు కోసి చంపాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అనంతరం మృతదేహాన్ని ఇంటికి సమీపంలో పాతిపెట్టి పరారయ్యాడు.
తాజావార్తలు
-
Mittapalli Surendar: ఇడుపు కాయితం వివాదం..వారికి తెలంగాణ లిరిసిస్ట్ ధన్యవాదాలు
-
PM Modi: ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్గా మారింది
-
Anganwadi Jobs: ఇంటర్ పాసైన మహిళలకు శుభవార్త.. అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు..
-
PM Modi: ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రతిధ్వని ప్రపంచానికి వినిపించింది.. మెల్బోర్న్లో మోడీ కామెంట్స్..
-
Harish Rao : సిద్దిపేటకు వచ్చి కాళేశ్వరం నీళ్లను చూడండి.. సీఎం రేవంత్కు హరీష్ రావు సవాల్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!