Iran Bomb Blasts: ఇరాన్లో బాంబు పేలుళ్లపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Bomb Blasts: ఇరాన్లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతుల పట్ల భారత్ సంతాపం వ్యక్తం చేసింది. ఇరాన్లోని కెర్మాన్లో గురువారం జరిగిన బాంబు పేలుళ్లపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విచారం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం కూడా సంఘీభావం తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తన ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్లో ఇలా రాశారు, “ఇరాన్లోని కెర్మాన్ నగరంలో జరిగిన ఘోర బాంబు పేలుళ్ల పట్ల మేము చింతిస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్ ప్రభుత్వం, ప్రజలతో మేము ఐక్యంగా ఉన్నాము. బాధితులు, గాయపడిన వారికి మా సానుభూతి.” అంటూ విచారం వ్యక్తం చేశారు.
Read Also: Gifts to Employees: ఉద్యోగులకు సర్ప్రైజ్.. 50 మందికి సరికొత్త కార్లను గిఫ్ట్గా ఇచ్చిన బాస్
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
బాంబు పేలుళ్లలో ఇప్పటివరకు 103 మంది మృతి
ఇరాన్లోని కెర్మాన్లో ఖాసిం సులేమానీ సమాధి సమీపంలో బుధవారం రెండు బాంబు పేలుళ్లు జరిగాయని మీకు తెలిసిందే. ఈ పేలుళ్లలో ఇప్పటివరకు 103 మంది మరణించినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో 188 మంది గాయపడ్డారు. ఇరాన్ అధికారులు దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొన్నారు, అయితే తదుపరి వివరాలు తెలియలేదు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ (IRNA) ప్రకారం.. మొదటి పేలుడు సులేమానీ సమాధికి 700 మీటర్ల దూరంలో జరిగిందని, రెండవది 600 మీటర్ల దూరంలో జరిగిందని నివేదించింది. ఘటన జరిగిన సమయంలో సమాధి దగ్గర వందలాది మంది ఉన్నారని వార్తా సంస్థ తెలిపింది.
అమెరికన్ వైమానిక దాడిలో సులేమానీ మరణించి నాలుగు సంవత్సరాలు అయిందని, దాడి జరిగినప్పుడు అతని నాల్గవ వర్ధంతి సందర్భంగా ప్రజలు గుమిగూడారనే సంగతి తెలిసిందే. ఈ పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగే ప్రమాదం ఉంది, ఎందుకంటే ఇది ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధంతో ముడిపడి ఉంది. ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆరోపించారు. ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఇరాన్ హెచ్చరించింది. అయితే ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా పేలుడుకు బాధ్యత వహించలేదు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!