Iran Bomb Blasts: ఇరాన్లో బాంబు పేలుళ్లపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Bomb Blasts: ఇరాన్లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతుల పట్ల భారత్ సంతాపం వ్యక్తం చేసింది. ఇరాన్లోని కెర్మాన్లో గురువారం జరిగిన బాంబు పేలుళ్లపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విచారం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం కూడా సంఘీభావం తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తన ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్లో ఇలా రాశారు, “ఇరాన్లోని కెర్మాన్ నగరంలో జరిగిన ఘోర బాంబు పేలుళ్ల పట్ల మేము చింతిస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్ ప్రభుత్వం, ప్రజలతో మేము ఐక్యంగా ఉన్నాము. బాధితులు, గాయపడిన వారికి మా సానుభూతి.” అంటూ విచారం వ్యక్తం చేశారు.
Read Also: Gifts to Employees: ఉద్యోగులకు సర్ప్రైజ్.. 50 మందికి సరికొత్త కార్లను గిఫ్ట్గా ఇచ్చిన బాస్
Also Read
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
- Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
బాంబు పేలుళ్లలో ఇప్పటివరకు 103 మంది మృతి
ఇరాన్లోని కెర్మాన్లో ఖాసిం సులేమానీ సమాధి సమీపంలో బుధవారం రెండు బాంబు పేలుళ్లు జరిగాయని మీకు తెలిసిందే. ఈ పేలుళ్లలో ఇప్పటివరకు 103 మంది మరణించినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో 188 మంది గాయపడ్డారు. ఇరాన్ అధికారులు దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొన్నారు, అయితే తదుపరి వివరాలు తెలియలేదు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ (IRNA) ప్రకారం.. మొదటి పేలుడు సులేమానీ సమాధికి 700 మీటర్ల దూరంలో జరిగిందని, రెండవది 600 మీటర్ల దూరంలో జరిగిందని నివేదించింది. ఘటన జరిగిన సమయంలో సమాధి దగ్గర వందలాది మంది ఉన్నారని వార్తా సంస్థ తెలిపింది.
అమెరికన్ వైమానిక దాడిలో సులేమానీ మరణించి నాలుగు సంవత్సరాలు అయిందని, దాడి జరిగినప్పుడు అతని నాల్గవ వర్ధంతి సందర్భంగా ప్రజలు గుమిగూడారనే సంగతి తెలిసిందే. ఈ పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగే ప్రమాదం ఉంది, ఎందుకంటే ఇది ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధంతో ముడిపడి ఉంది. ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆరోపించారు. ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఇరాన్ హెచ్చరించింది. అయితే ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా పేలుడుకు బాధ్యత వహించలేదు.
తాజావార్తలు
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..