Iran Bomb Blasts: ఇరాన్లో బాంబు పేలుళ్లపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతి
Iran Bomb Blasts: ఇరాన్లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతుల పట్ల భారత్ సంతాపం వ్యక్తం చేసింది. ఇరాన్లోని కెర్మాన్లో గురువారం జరిగిన బాంబు పేలుళ్లపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విచారం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం కూడా సంఘీభావం తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తన ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్లో ఇలా రాశారు, “ఇరాన్లోని కెర్మాన్ నగరంలో జరిగిన ఘోర బాంబు పేలుళ్ల పట్ల మేము చింతిస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్ ప్రభుత్వం, ప్రజలతో మేము ఐక్యంగా ఉన్నాము. బాధితులు, గాయపడిన వారికి మా సానుభూతి.” అంటూ విచారం వ్యక్తం చేశారు.
Read Also: Gifts to Employees: ఉద్యోగులకు సర్ప్రైజ్.. 50 మందికి సరికొత్త కార్లను గిఫ్ట్గా ఇచ్చిన బాస్
Also Read
బాంబు పేలుళ్లలో ఇప్పటివరకు 103 మంది మృతి
ఇరాన్లోని కెర్మాన్లో ఖాసిం సులేమానీ సమాధి సమీపంలో బుధవారం రెండు బాంబు పేలుళ్లు జరిగాయని మీకు తెలిసిందే. ఈ పేలుళ్లలో ఇప్పటివరకు 103 మంది మరణించినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో 188 మంది గాయపడ్డారు. ఇరాన్ అధికారులు దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొన్నారు, అయితే తదుపరి వివరాలు తెలియలేదు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ (IRNA) ప్రకారం.. మొదటి పేలుడు సులేమానీ సమాధికి 700 మీటర్ల దూరంలో జరిగిందని, రెండవది 600 మీటర్ల దూరంలో జరిగిందని నివేదించింది. ఘటన జరిగిన సమయంలో సమాధి దగ్గర వందలాది మంది ఉన్నారని వార్తా సంస్థ తెలిపింది.
అమెరికన్ వైమానిక దాడిలో సులేమానీ మరణించి నాలుగు సంవత్సరాలు అయిందని, దాడి జరిగినప్పుడు అతని నాల్గవ వర్ధంతి సందర్భంగా ప్రజలు గుమిగూడారనే సంగతి తెలిసిందే. ఈ పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగే ప్రమాదం ఉంది, ఎందుకంటే ఇది ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధంతో ముడిపడి ఉంది. ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆరోపించారు. ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఇరాన్ హెచ్చరించింది. అయితే ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా పేలుడుకు బాధ్యత వహించలేదు.
తాజావార్తలు
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
Venkatesh: మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో