Iran Bomb Blasts: ఇరాన్లో బాంబు పేలుళ్లపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Bomb Blasts: ఇరాన్లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతుల పట్ల భారత్ సంతాపం వ్యక్తం చేసింది. ఇరాన్లోని కెర్మాన్లో గురువారం జరిగిన బాంబు పేలుళ్లపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విచారం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం కూడా సంఘీభావం తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తన ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్లో ఇలా రాశారు, “ఇరాన్లోని కెర్మాన్ నగరంలో జరిగిన ఘోర బాంబు పేలుళ్ల పట్ల మేము చింతిస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్ ప్రభుత్వం, ప్రజలతో మేము ఐక్యంగా ఉన్నాము. బాధితులు, గాయపడిన వారికి మా సానుభూతి.” అంటూ విచారం వ్యక్తం చేశారు.
Read Also: Gifts to Employees: ఉద్యోగులకు సర్ప్రైజ్.. 50 మందికి సరికొత్త కార్లను గిఫ్ట్గా ఇచ్చిన బాస్
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
బాంబు పేలుళ్లలో ఇప్పటివరకు 103 మంది మృతి
ఇరాన్లోని కెర్మాన్లో ఖాసిం సులేమానీ సమాధి సమీపంలో బుధవారం రెండు బాంబు పేలుళ్లు జరిగాయని మీకు తెలిసిందే. ఈ పేలుళ్లలో ఇప్పటివరకు 103 మంది మరణించినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో 188 మంది గాయపడ్డారు. ఇరాన్ అధికారులు దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొన్నారు, అయితే తదుపరి వివరాలు తెలియలేదు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ (IRNA) ప్రకారం.. మొదటి పేలుడు సులేమానీ సమాధికి 700 మీటర్ల దూరంలో జరిగిందని, రెండవది 600 మీటర్ల దూరంలో జరిగిందని నివేదించింది. ఘటన జరిగిన సమయంలో సమాధి దగ్గర వందలాది మంది ఉన్నారని వార్తా సంస్థ తెలిపింది.
అమెరికన్ వైమానిక దాడిలో సులేమానీ మరణించి నాలుగు సంవత్సరాలు అయిందని, దాడి జరిగినప్పుడు అతని నాల్గవ వర్ధంతి సందర్భంగా ప్రజలు గుమిగూడారనే సంగతి తెలిసిందే. ఈ పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగే ప్రమాదం ఉంది, ఎందుకంటే ఇది ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధంతో ముడిపడి ఉంది. ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆరోపించారు. ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఇరాన్ హెచ్చరించింది. అయితే ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా పేలుడుకు బాధ్యత వహించలేదు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!