Iran Bomb Blasts: ఇరాన్లో బాంబు పేలుళ్లపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Bomb Blasts: ఇరాన్లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతుల పట్ల భారత్ సంతాపం వ్యక్తం చేసింది. ఇరాన్లోని కెర్మాన్లో గురువారం జరిగిన బాంబు పేలుళ్లపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విచారం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం కూడా సంఘీభావం తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తన ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్లో ఇలా రాశారు, “ఇరాన్లోని కెర్మాన్ నగరంలో జరిగిన ఘోర బాంబు పేలుళ్ల పట్ల మేము చింతిస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్ ప్రభుత్వం, ప్రజలతో మేము ఐక్యంగా ఉన్నాము. బాధితులు, గాయపడిన వారికి మా సానుభూతి.” అంటూ విచారం వ్యక్తం చేశారు.
Read Also: Gifts to Employees: ఉద్యోగులకు సర్ప్రైజ్.. 50 మందికి సరికొత్త కార్లను గిఫ్ట్గా ఇచ్చిన బాస్
Also Read
- IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
- Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
బాంబు పేలుళ్లలో ఇప్పటివరకు 103 మంది మృతి
ఇరాన్లోని కెర్మాన్లో ఖాసిం సులేమానీ సమాధి సమీపంలో బుధవారం రెండు బాంబు పేలుళ్లు జరిగాయని మీకు తెలిసిందే. ఈ పేలుళ్లలో ఇప్పటివరకు 103 మంది మరణించినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో 188 మంది గాయపడ్డారు. ఇరాన్ అధికారులు దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొన్నారు, అయితే తదుపరి వివరాలు తెలియలేదు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ (IRNA) ప్రకారం.. మొదటి పేలుడు సులేమానీ సమాధికి 700 మీటర్ల దూరంలో జరిగిందని, రెండవది 600 మీటర్ల దూరంలో జరిగిందని నివేదించింది. ఘటన జరిగిన సమయంలో సమాధి దగ్గర వందలాది మంది ఉన్నారని వార్తా సంస్థ తెలిపింది.
అమెరికన్ వైమానిక దాడిలో సులేమానీ మరణించి నాలుగు సంవత్సరాలు అయిందని, దాడి జరిగినప్పుడు అతని నాల్గవ వర్ధంతి సందర్భంగా ప్రజలు గుమిగూడారనే సంగతి తెలిసిందే. ఈ పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగే ప్రమాదం ఉంది, ఎందుకంటే ఇది ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధంతో ముడిపడి ఉంది. ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆరోపించారు. ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఇరాన్ హెచ్చరించింది. అయితే ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా పేలుడుకు బాధ్యత వహించలేదు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!