Rajasthan: విషాదం.. భర్త మృతితో షాక్కు గురై..భార్య, కొడుకు కూడా మృతి
- రాజస్థాన్లోని షాపురా జిల్లాలో ఓ విషాద ఘటన
- భర్త మృతితో షాక్కు గురైన భార్య..కుమారుడు కూడా మృతి
- శనివారం మృతి చెందిన భర్త..24గంటల వ్యవధిలోనే భార్య..కుమారుడి మరణం
- గ్రామంలో అలుముకున్న విషాదఛాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని షాపురా జిల్లాలో ఓ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త మృతితో షాక్కు గురైన భార్య, కుమారుడు కూడా మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ముగ్గురి పోస్టుమార్టం నివేదికలు వచ్చిన తర్వాతే మొత్తం పరిస్థితి తేలనుందని పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
READ MORE: Godavari Floods: గోదావరికి శబరిపోటు.. ప్రమాద హెచ్చరికలు జారీ
Also Read
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
- Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
- Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
అసలేం జరిగిందంటే.. షాహపురా జిల్లాలోని కోత్రి సబ్డివిజన్లోని బద్లియాస్ గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ సత్యనారాయణ సోని శనివారం ఉదయం పొలానికి వెళ్లారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. శనివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే.. భర్త మరణం తర్వాత షాక్ కు గురైన భార్య మమత, కుమారుడు అశుతోష్ ఆదివారం అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే వారిద్దరినీ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ.. తల్లి, కొడుకు మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందిన వార్త ఆ ప్రాంతంలోని ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఆదివారం మధ్యాహ్నం తల్లీకొడుకుల అంత్యక్రియలు జరగడంతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి.
READ MORE: India-Pak: సరిహద్దుల్లో పాక్ దుశ్చర్య..ఫెన్సింగ్ కట్ చేసిన పాక్ పౌరులు
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యన్నారాయణ సోనిని గత కొన్ని రోజులుగా వడ్డీ వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారు. ఈ కుటుంబంలో ముగ్గురు మృతికి గల కారణాలేమిటన్నది పోలీసుల విచారణలో తేలనుంది. బద్లియాస్ పోలీస్ స్టేషన్ మొత్తం కేసును సీరియస్గా విచారించడం ప్రారంభించింది. ముగ్గురి పోస్టుమార్టం నివేదిక తర్వాతే మొత్తం పరిస్థితి తేలనుందని బద్లియాస్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ సిద్ధార్థ్ ప్రజాపత్ తెలిపారు.
తాజావార్తలు
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!