Ganesh Immersion: గణేష్ నిమజ్జనంలో 400 మంది పోకిరీలు అరెస్టు
గణేష్ ఉత్సవాల్లో దాదాపు 400 మందికి పైగా పోకిరీలపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నిమజ్జనం పనులను ఆయన పరిశీలించారు. ట్యాంక్బండ్ దగ్గర గణేశ్ నిమజ్జనం ముగిసిందని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఖైరతాబాద్ మహాగణపతిని అనుకున్న సమయం కంటే ముందుగా నిమజ్జనం చేశామన్నారు. జియో ట్యాగింగ్ లెక్కల ప్రకారం పది వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం పూర్తి చేశామని సీపీ తెలిపారు. ఈసారి భారీగా విగ్రహాలు ఏర్పాటు చేయడంతో నిమజ్జనం ఆలస్యమైందన్నారు. గతే ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 నుంచి 15 శాతం ఎక్కువ విగ్రహాలు ఏర్పాటు చేశారు.. అందుకే ఈ నిమజ్జనాల సందర్భంగా ప్రత్యేకంగా షీ టీమ్లను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.
Read Also: YS Jagan: రూటు మార్చిన వైఎస్ జగన్.. పార్టీ కార్యక్రమాలపై ఫోకస్
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
అయితే, ఉత్సవాలకు వచ్చే మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం, వేధించడం వంటిచి చేసిన 400 మందిపై కేసులు నమోదు చేశారని సీపీ ఆనంద్ వెల్లడించారు. పవిత్రమైన శోభాయాత్రకు కొందరు మద్యం తాగి వచ్చారని, అలాంటి వారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. మిలాదునబీ పండుగ సందర్భంగా ముస్లి మత పెద్దలు గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు. వినాయకచవితి ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్టోబర్ 1న పండుగ ర్యాలీ నిర్వహించుకునేలా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలిపిన సీపీ, మిలాదునబీ పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఆసభ్యంగా ప్రవర్తించిన పోకిరిలపై స్పై ఆపరేషన్ చేసి షీ పట్టుకుందని హైదరాబాద్ సీపీ తెలిపారు.
Read Also: Monsoon Tomato Cultivation: వర్షాకాలంలో టమోటా సాగులో మెళుకువలు..
ఇక, ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర సందర్భంగా రద్దీ ప్రదేశాలు, మహిళలు ఎక్కువ మంది వచ్చే ప్రదేశాల్లో షీ టీమ్లను ఏర్పాటు చేసినట్లు సీపీ ఆనంద్ చెప్పారు. ఎక్కడా నేరాలు జరుగకుండా, మహిళ భద్రతకు ప్రధాన్యత ఇస్తూ చైన్ స్నాచింగులు, చోరీలు, వేధింపులు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి వాటిపై ఎక్కడా ఫిర్యాదులు అందలేదు అని సీపీ అన్నారు. నిమజ్జనం సందర్భంగా చాలా మంది మద్యం సేవించి వచ్చారని, ప్రమాదకరంగా వాహనాలపై డాన్సులు చేస్తూ వచ్చారు, అసభ్యకరమైన పాటలకు డాన్స్లు చేశారని ఆయన చెప్పారు. ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేయడంలో సిటీ పోలీసులు అధికారులు తీవ్రంగా కష్టపడ్డారని, వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు సీపీ ఆనంద్ అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?