Shashi Tharoor: 15 ఏళ్లుగా ఎంపీగా ఈ పనులు చేశా.. డెవలప్మెంట్ రిపోర్టు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: తిరువనంతపురం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అభ్యర్థి శశి థరూర్ గత 15 సంవత్సరాలుగా నియోజక వర్గానికి ఎంపీగా చేసిన సేవలను వివరిస్తూ 68 పేజీల బుక్లెట్ను శనివారం విడుదల చేశారు. ఇక్కడ జరిగిన సభలో శశి థరూర్ మాట్లాడుతూ.. తాను పోటీ చేసినప్పుడల్లా నిరాధారమైన ఆరోపణలకు గురవుతున్నానని, గత 15 ఏళ్లుగా నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఈసారి అభియోగం మోపారన్నారు. గత 15 ఏళ్లుగా నేనేమీ చేయలేదని అభియోగం మోపారని.. అందుకే 68 పేజీల డెవలప్మెంట్ రిపోర్టును విడుదల చేస్తున్నానని శశిథరూర్ అన్నారు. ‘మోడీయుడే గ్యారెంటీ’ (మోడీ హామీ) అనే పదబంధాన్ని కూడా ఆయన అపహాస్యం చేసారు. వారు తమ హామీలను అమలు చేయరని మాత్రమే బీజేపీ హామీ అని ఆయన విమర్శలు గుప్పించారు. “జుమ్లా వారి ఏకైక హామీ” అన్నారాయన.
Read Also: Arvind Kejriwal: వీధి వ్యాపారులపై సర్వే.. సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం..
Also Read
ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్ బుక్లెట్ తొలి ప్రతిని అందుకున్నారు. శశి థరూర్ మాట్లాడుతూ.. తాను ముందుగా బుక్లెట్ను రాజకీయ నాయకుడికి అందజేయాలని భావించానని, ఆపై విస్తృతంగా గౌరవించబడిన ప్రజానాయకుడిని ఆహ్వానించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ‘‘నా పనులు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసం. కాబట్టి నేను ఈ అభివృద్ధి నివేదికను విస్తృతంగా ఆమోదించిన, గౌరవించే ఒక ప్రజా వ్యక్తికి ఇస్తే బాగుంటుందని భావించాను. అంగీకరించినందుకు అదూర్ గోపాలకృష్ణన్కి ధన్యవాదాలు.” అని శశి థరూర్ అన్నారు.
Read Also: Lok Sabha Elections 2024: దేశంలో 48 వేల ట్రాన్స్జెండర్ ఓటర్లు.. ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారంటే?
శశిథరూర్ నియోజకవర్గానికి తాను చేసిన అభివృద్ధి పనులను, జాతీయ రహదారి బైపాస్, విజింజం ఓడరేవు నిర్మాణం వంటి ప్రధాన పనులలో పోషించిన పాత్రలను జాబితాలో పేర్కొన్నారు. గత పదేళ్లలో తిరువనంతపురం కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఏమీ చేయలేదని కాంగ్రెస్ ఎంపీ విమర్శించారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదని శశిథరూర్ అన్నారు. ప్రస్తుత ఎన్డీయే అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత వాగ్దానాలు చేస్తున్నారని ఆయన అన్నారు. శశి థరూర్ కేవలం అభివృద్ధి ఆధారంగానే కాకుండా దేశంలోని ప్రధాన సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న రాజకీయ వైఖరి కోసం కూడా ఓట్లు అడుగుతున్నానని చెప్పారు. బీజేపీపై తన పోరాటాన్ని కొనసాగించాలని, నియోజకవర్గం కోసం చేసిన మంచి పనిని కొనసాగించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!