Lok Sabha Elections 2024: దేశంలో 48 వేల ట్రాన్స్జెండర్ ఓటర్లు.. ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: దేశంలో ఎన్నికల నగారా మోగింది. . దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 49.7 కోట్లు కాగా, మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. 18-19 ఏళ్ల మధ్య 85.3 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని కమిషన్ తెలిపింది. 12 రాష్ట్రాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని ఈసీ తెలిపింది. దేశవ్యాప్తంగా 18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 21 లక్షల మంది ఉన్నారని స్పష్టం చేసింది. దేశంలో 48 వేల ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో 48,000 మంది ట్రాన్స్జెండర్లు ఓటు వేయడానికి అర్హులని ఆయన ఈరోజు తెలిపారు. మొత్తం 97 కోట్ల మంది ఓటర్లలో 48,000 మంది లింగమార్పిడి ఓటర్లు ఉన్నారని చెప్పారు.
2019 లోక్సభ ఎన్నికలలో లింగమార్పిడి ఓటర్ల సంఖ్య 39,075 ఉండగా.. వారిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ (7,797), తమిళనాడు (5,793), కర్ణాటక (4,826) ఉన్నారు. లింగమార్పిడి ఓటర్లు లేని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అరుణాచల్ ప్రదేశ్, డామన్ అండ్ డయ్యూ, గోవా, లక్షద్వీప్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కింలుగా గుర్తించారు.
Also Read
Read Also: Election Commission: జమ్మూ కాశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన
ఎన్నికల సంఘం ప్రకారం.. “ఓటరు వెనుకబడి ఉండకూడదు” అనే దాని ఆదేశానికి కట్టుబడి, ఎన్నికల ప్రక్రియలో సమాజంలోని అన్ని వర్గాలను చేర్చేందుకు అవసరమైన ప్రయత్నాలు చేపట్టబడ్డాయి. “ఎన్నికల జాబితాలో ట్రాన్స్జెండర్లను నమోదు చేయడం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా వారిని ప్రేరేపించడం ఎన్నికల కమిషన్కు పెద్ద సవాలుగా ఉంది. ట్రాన్స్జెండర్లలో అవగాహన కల్పించడానికి అనేక చర్యలు చేపట్టబడ్డాయి. ఫలితంగా థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య పెరిగింది. ” 2019 సాధారణ ఎన్నికలపై భారత ఎన్నికల సంఘం నివేదికను విడుదల చేసింది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!