Lok Sabha Elections 2024: దేశంలో 48 వేల ట్రాన్స్జెండర్ ఓటర్లు.. ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: దేశంలో ఎన్నికల నగారా మోగింది. . దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 49.7 కోట్లు కాగా, మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. 18-19 ఏళ్ల మధ్య 85.3 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని కమిషన్ తెలిపింది. 12 రాష్ట్రాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని ఈసీ తెలిపింది. దేశవ్యాప్తంగా 18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 21 లక్షల మంది ఉన్నారని స్పష్టం చేసింది. దేశంలో 48 వేల ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో 48,000 మంది ట్రాన్స్జెండర్లు ఓటు వేయడానికి అర్హులని ఆయన ఈరోజు తెలిపారు. మొత్తం 97 కోట్ల మంది ఓటర్లలో 48,000 మంది లింగమార్పిడి ఓటర్లు ఉన్నారని చెప్పారు.
2019 లోక్సభ ఎన్నికలలో లింగమార్పిడి ఓటర్ల సంఖ్య 39,075 ఉండగా.. వారిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ (7,797), తమిళనాడు (5,793), కర్ణాటక (4,826) ఉన్నారు. లింగమార్పిడి ఓటర్లు లేని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అరుణాచల్ ప్రదేశ్, డామన్ అండ్ డయ్యూ, గోవా, లక్షద్వీప్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కింలుగా గుర్తించారు.
Also Read
- Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
- Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
- Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
Read Also: Election Commission: జమ్మూ కాశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన
ఎన్నికల సంఘం ప్రకారం.. “ఓటరు వెనుకబడి ఉండకూడదు” అనే దాని ఆదేశానికి కట్టుబడి, ఎన్నికల ప్రక్రియలో సమాజంలోని అన్ని వర్గాలను చేర్చేందుకు అవసరమైన ప్రయత్నాలు చేపట్టబడ్డాయి. “ఎన్నికల జాబితాలో ట్రాన్స్జెండర్లను నమోదు చేయడం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా వారిని ప్రేరేపించడం ఎన్నికల కమిషన్కు పెద్ద సవాలుగా ఉంది. ట్రాన్స్జెండర్లలో అవగాహన కల్పించడానికి అనేక చర్యలు చేపట్టబడ్డాయి. ఫలితంగా థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య పెరిగింది. ” 2019 సాధారణ ఎన్నికలపై భారత ఎన్నికల సంఘం నివేదికను విడుదల చేసింది.
తాజావార్తలు
-
Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
-
Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
-
Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!