Lok Sabha Elections 2024: దేశంలో 48 వేల ట్రాన్స్జెండర్ ఓటర్లు.. ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: దేశంలో ఎన్నికల నగారా మోగింది. . దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 49.7 కోట్లు కాగా, మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. 18-19 ఏళ్ల మధ్య 85.3 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని కమిషన్ తెలిపింది. 12 రాష్ట్రాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని ఈసీ తెలిపింది. దేశవ్యాప్తంగా 18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 21 లక్షల మంది ఉన్నారని స్పష్టం చేసింది. దేశంలో 48 వేల ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో 48,000 మంది ట్రాన్స్జెండర్లు ఓటు వేయడానికి అర్హులని ఆయన ఈరోజు తెలిపారు. మొత్తం 97 కోట్ల మంది ఓటర్లలో 48,000 మంది లింగమార్పిడి ఓటర్లు ఉన్నారని చెప్పారు.
2019 లోక్సభ ఎన్నికలలో లింగమార్పిడి ఓటర్ల సంఖ్య 39,075 ఉండగా.. వారిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ (7,797), తమిళనాడు (5,793), కర్ణాటక (4,826) ఉన్నారు. లింగమార్పిడి ఓటర్లు లేని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అరుణాచల్ ప్రదేశ్, డామన్ అండ్ డయ్యూ, గోవా, లక్షద్వీప్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కింలుగా గుర్తించారు.
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
Read Also: Election Commission: జమ్మూ కాశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన
ఎన్నికల సంఘం ప్రకారం.. “ఓటరు వెనుకబడి ఉండకూడదు” అనే దాని ఆదేశానికి కట్టుబడి, ఎన్నికల ప్రక్రియలో సమాజంలోని అన్ని వర్గాలను చేర్చేందుకు అవసరమైన ప్రయత్నాలు చేపట్టబడ్డాయి. “ఎన్నికల జాబితాలో ట్రాన్స్జెండర్లను నమోదు చేయడం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా వారిని ప్రేరేపించడం ఎన్నికల కమిషన్కు పెద్ద సవాలుగా ఉంది. ట్రాన్స్జెండర్లలో అవగాహన కల్పించడానికి అనేక చర్యలు చేపట్టబడ్డాయి. ఫలితంగా థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య పెరిగింది. ” 2019 సాధారణ ఎన్నికలపై భారత ఎన్నికల సంఘం నివేదికను విడుదల చేసింది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!