Shashi Tharoor: కేరళ సీఎంగా శశి థరూర్? ఫలితాలకు కొద్ది గంటల ముందు థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: కేరళం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కొద్ది గంటల ముందు రాజకీయ వర్గాల్లో ఓ ప్రశ్న విపరీతంగా వినిపిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) అధికారంలోకి వస్తే, శశి థరూర్ ముఖ్యమంత్రి అవుతారా? అందరిలో ఉత్పన్నమైంది. ఈ ప్రశ్నకు థరూర్ చాలా చాకచక్యంగా సమాధానమిచ్చారు. తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నానా లేదా అనే విషయంపై స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ, అంతిమ నిర్ణయం పార్టీ అధిష్టానానిదేనని తేల్చి చెప్పారు. తనను ఈ ప్రశ్నతో ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారని నవ్వుతూ వ్యాఖ్యానించిన థరూర్, కాంగ్రెస్ పార్టీలో ఓ నిర్దిష్టమైన ప్రక్రియ ఉంటుందని గుర్తుచేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, పార్టీ అధ్యక్షుడి ప్రతినిధి వచ్చి గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటారని, ఆ తర్వాతే హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంలో పార్టీకి ఎటువంటి పరిమితులు ఉండవని, ఎవరినైనా ఎంపిక చేసే అధికారం అధిష్టానానికి ఉంటుందని పేర్కొన్నారు.
మరోవైపు, కేరళంలో కాంగ్రెస్ విజయంపై థరూర్ ధీమా వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత యూడీఎఫ్ మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకోబోతోందని, 140 స్థానాలున్న అసెంబ్లీలో తమ కూటమి 75 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ కూడా యూడీఎఫ్కే మొగ్గు చూపుతుండటంతో ఎల్డిఎఫ్ (LDF) ప్రభుత్వం ఇంటికి వెళ్లడం ఖాయమని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, దేశంలో ఎక్కడా వామపక్ష ప్రభుత్వం అధికారంలో లేని పరిస్థితి వస్తుందని, ఇది జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామమని ఆయన విశ్లేషించారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయతపై థరూర్ కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. సర్వేలు ఎప్పుడూ పూర్తి చిత్రాన్ని ప్రతిబింబించలేవని, కుల, ప్రాంతీయ, వర్గ సమీకరణాలను అంచనా వేయడం కష్టమని అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ ఉదాహరణను ప్రస్తావిస్తూ, ఒక సర్వేలో 60 శాతం మంది అసలు సమాధానమే ఇవ్వలేదని, అటువంటప్పుడు ఆ సర్వేలకు ఎంత విలువ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఏప్రిల్ 9న కేరళ అసెంబ్లీకి పోలింగ్ జరగగా, మే 4న వెలువడే ఫలితాలు థరూర్ రాజకీయ భవిష్యత్తును, కేరళం భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. ముఖ్యమంత్రి పదవిపై థరూర్ మౌనం వహించినా, కాంగ్రెస్ గెలిస్తే మాత్రం ఈ చర్చ మళ్లీ మొదలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
- NEET 2026: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు శుభవార్త!
- Explained: రెండూ మెసేజింగ్ యాప్లే కానీ.. వాట్సాప్ను వదిలేసి టెలిగ్రామ్నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
- Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
- Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
తాజావార్తలు
-
NEET 2026: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు శుభవార్త!
-
Sanchita Ugale : సంచితా ఉగలే ఆత్మహత్యతో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుకు సంబంధం ఉందా?
-
Explained: రెండూ మెసేజింగ్ యాప్లే కానీ.. వాట్సాప్ను వదిలేసి టెలిగ్రామ్నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
-
Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
-
Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?