Shashi Tharoor: కాంగ్రెస్ 4 పేర్లు సూచించింది..అయినా శశిథరూర్కే మోడీ ఓటు..
- కాంగ్రెస్ 4 పేర్లు సూచించినా, శశిథరూర్కే కేంద్రం ఓటు..
- అఖిలపక్ష దౌత్యపర్యటనకు నాయకత్వం..
- కాంగ్రెస్, థరూర్ మధ్య విభేదాలు స్పష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న ఉగ్రవాదం గురించి ప్రపంచ వ్యాప్తంగా ఎండగట్టడానికి భారత్ అఖిలపక్షంతో కూడి ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది. దేశంలోని పలు పార్టీలకు చెందిన ఎంపీలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఎలా మద్దతు ఇస్తుందనే అంశాన్ని విదేశాలకు వీరు చెప్పనున్నారు. అయితే, ఇప్పుడు ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ని ఎంపిక చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారం థరూర్, కాంగ్రెస్ మధ్య విభేదాలను స్పష్టంగా చూపిస్తుంది.
అయితే, విదేశాలకు వెళ్తున్న ప్రతినిధి బృందానికి సంబంధించి నాలుగు పేర్లు సూచించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మే 16 ఉదయం కాంగ్రెస్ని కోరారు. కాంగ్రెస్ మాజీ క్యాబినెట్ మినిస్టర్ ఆనంద్ శర్మ, లోక్సభలో ఉప ప్రతిపక్ష నాయకుడు గౌరవ్ గొగోయ్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్, లోక్ సభ ఎంపీ రాజా బ్రార్ పేర్లను సూచించింది. కానీ, కేంద్రం మాత్రం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కే ఓటేసింది. థరూర్ని ఒక అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.
Also Read
- Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
- Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
Read Also: India-Pakistan: పాకిస్థాన్పై దౌత్య యుద్ధానికి భారత్ సిద్ధం.. ఏడు అఖిలపక్ష బృందాల ఏర్పాటు..
థరూర్తో పాటు బిజెపి నాయకులు రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, జనతాదళ్ (యునైటెడ్) ఎంపి సంజయ్ కుమార్ ఝా, డిఎంకెకు చెందిన కనిమొళి కరుణానిధి, ఎన్సిపి (శరద్ పవార్ వర్గం) నాయకురాలు సుప్రియా సులే, శివసేన (షిండే వర్గం) ఎంపి శ్రీకాంత్ షిండే ఈ అఖిలపక్ష బృందాలకు నాయకత్వం వహిస్తారు. తన ఎంపికపై శశి థరూర్ మాట్లాడుతూ.. ‘‘జాతీయ ప్రయోజనాల కోసం నా సేవలు అవసరమైనప్పుడు ముందుంటాను’’ అని ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ సూచించిన నలుగురి పేర్లను పట్టించుకోకుండా కేంద్రం థరూర్ని ఎంపిక చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్రమోడీపై, ఆపరేషన్ సిందూర్పై థరూర్ ప్రశంసలు కురిపించారు. పలు కార్యక్రమాల్లో మోడీతో కలిసి పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీలో కొంత మంది థరూర్ ‘‘లక్ష్మణ రేఖ’’ దాటారంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం మే 23 నుండి 10 రోజుల దౌత్య మిషన్ను ప్రారంభిస్తుంది, వాషింగ్టన్, లండన్, అబుదాబి, ప్రిటోరియా, టోక్యో వంటి కీలక రాజధానులను సందర్శిస్తుంది. ఉగ్రవాదంపై భారత్ ‘‘జీరో టాలరెన్స్’’ విధానం గురించి, పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న విషయాన్ని, ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడిని, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి వివరిస్తారు.
తాజావార్తలు
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
-
Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
-
Johnny Master – Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..