Maharashtra: ప్రధాని మోడీకి అవార్డు.. ఒకే వేదికను పంచుకోనున్న శరద్ పవార్, అజిత్ పవార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar, nephew Ajit to share stage at PM Modi’s Pune event: లోకమాన్య తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ప్రకారం, ఆగస్టు 1న పుణెలో ప్రధాని నరేంద్ర మోదీ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును అందుకోనున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ ఈ కార్యక్రమానికి హాజరవుతుండగా.. అజిత్ పవార్ కూడా హాజరవుతారు. ఎన్సీపీలో చీలిక తర్వాత వారు ఓ వేదికను పంచుకోవడం ఇదే మొదటిసారి. జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో కూడిన ఈ అవార్డును ప్రధానమంత్రి ఆదర్శప్రాయమైన నాయకత్వానికి, పౌరులలో దేశభక్తిని పెంపొందించడానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తున్నట్లు ట్రస్ట్ తెలిపింది. “ప్రధానమంత్రి మోడీ పౌరులలో దేశభక్తి భావనను మేల్కొల్పారు. భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉంచారు. ఆయన పట్టుదల, కృషిని పరిగణనలోకి తీసుకుని తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ధర్మకర్తలు ఆయనను ఈ అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు” అని ట్రస్ట్ తెలిపింది.
Also Read: panchayat election results: నేడు పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య తిలక్ 103వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ వేడుక జరగనుంది. ట్రస్ట్ అధికారికంగా విడుదల చేసిన ప్రకారం, పుణెలో జరిగే ఈ కార్యక్రమానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇద్దరూ ప్రసంగించనున్నారు. మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే కూడా అవార్డు ప్రదానోత్సవానికి హాజరుకానున్నారు.
మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఎన్సీపీ చీలిక తర్వాత, పార్టీ అధినేత శరద్ పవార్, ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ కలిసి ఓ కార్యక్రమానికి హాజరుకావడం ఇదే తొలిసారి.అజిత్ పవార్ జులై 2న మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!