Maharashtra: ప్రధాని మోడీకి అవార్డు.. ఒకే వేదికను పంచుకోనున్న శరద్ పవార్, అజిత్ పవార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar, nephew Ajit to share stage at PM Modi’s Pune event: లోకమాన్య తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ప్రకారం, ఆగస్టు 1న పుణెలో ప్రధాని నరేంద్ర మోదీ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును అందుకోనున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ ఈ కార్యక్రమానికి హాజరవుతుండగా.. అజిత్ పవార్ కూడా హాజరవుతారు. ఎన్సీపీలో చీలిక తర్వాత వారు ఓ వేదికను పంచుకోవడం ఇదే మొదటిసారి. జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో కూడిన ఈ అవార్డును ప్రధానమంత్రి ఆదర్శప్రాయమైన నాయకత్వానికి, పౌరులలో దేశభక్తిని పెంపొందించడానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తున్నట్లు ట్రస్ట్ తెలిపింది. “ప్రధానమంత్రి మోడీ పౌరులలో దేశభక్తి భావనను మేల్కొల్పారు. భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉంచారు. ఆయన పట్టుదల, కృషిని పరిగణనలోకి తీసుకుని తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ధర్మకర్తలు ఆయనను ఈ అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు” అని ట్రస్ట్ తెలిపింది.
Also Read: panchayat election results: నేడు పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు
Also Read
స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య తిలక్ 103వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ వేడుక జరగనుంది. ట్రస్ట్ అధికారికంగా విడుదల చేసిన ప్రకారం, పుణెలో జరిగే ఈ కార్యక్రమానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇద్దరూ ప్రసంగించనున్నారు. మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే కూడా అవార్డు ప్రదానోత్సవానికి హాజరుకానున్నారు.
మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఎన్సీపీ చీలిక తర్వాత, పార్టీ అధినేత శరద్ పవార్, ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ కలిసి ఓ కార్యక్రమానికి హాజరుకావడం ఇదే తొలిసారి.అజిత్ పవార్ జులై 2న మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..