Maharashtra: ప్రధాని మోడీకి అవార్డు.. ఒకే వేదికను పంచుకోనున్న శరద్ పవార్, అజిత్ పవార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar, nephew Ajit to share stage at PM Modi’s Pune event: లోకమాన్య తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ప్రకారం, ఆగస్టు 1న పుణెలో ప్రధాని నరేంద్ర మోదీ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును అందుకోనున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ ఈ కార్యక్రమానికి హాజరవుతుండగా.. అజిత్ పవార్ కూడా హాజరవుతారు. ఎన్సీపీలో చీలిక తర్వాత వారు ఓ వేదికను పంచుకోవడం ఇదే మొదటిసారి. జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో కూడిన ఈ అవార్డును ప్రధానమంత్రి ఆదర్శప్రాయమైన నాయకత్వానికి, పౌరులలో దేశభక్తిని పెంపొందించడానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తున్నట్లు ట్రస్ట్ తెలిపింది. “ప్రధానమంత్రి మోడీ పౌరులలో దేశభక్తి భావనను మేల్కొల్పారు. భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉంచారు. ఆయన పట్టుదల, కృషిని పరిగణనలోకి తీసుకుని తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ధర్మకర్తలు ఆయనను ఈ అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు” అని ట్రస్ట్ తెలిపింది.
Also Read: panchayat election results: నేడు పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు
Also Read
- RCB Vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర వివాదం.. అంపైర్ నిర్ణయంపై కోహ్లీ, అనుష్క షాక్.. ఇలా కూడా చేస్తారా అంటూ అసహనం..
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
- Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్దే.. వరల్డ్ కప్లో సూర్యవంశీకి చోటు..
- RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్కు చేరిన ఓపెనర్స్..
స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య తిలక్ 103వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ వేడుక జరగనుంది. ట్రస్ట్ అధికారికంగా విడుదల చేసిన ప్రకారం, పుణెలో జరిగే ఈ కార్యక్రమానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇద్దరూ ప్రసంగించనున్నారు. మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే కూడా అవార్డు ప్రదానోత్సవానికి హాజరుకానున్నారు.
మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఎన్సీపీ చీలిక తర్వాత, పార్టీ అధినేత శరద్ పవార్, ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ కలిసి ఓ కార్యక్రమానికి హాజరుకావడం ఇదే తొలిసారి.అజిత్ పవార్ జులై 2న మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
RCB Vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర వివాదం.. అంపైర్ నిర్ణయంపై కోహ్లీ, అనుష్క షాక్.. ఇలా కూడా చేస్తారా అంటూ అసహనం..
-
Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
-
UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
-
Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
-
Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్దే.. వరల్డ్ కప్లో సూర్యవంశీకి చోటు..
ట్రెండింగ్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!