RGIA : మరోసారి శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాలు ఆలస్యం.. ప్రయాణికుల ఆగ్రహం
- స్పైస్జెట్ విమాన ఆలస్యంపై హైడ్రామా
- రన్వే పైకి వెళ్లి తిరిగి పార్కింగ్ బేలోకి వచ్చిన విమానం!
- విమానయాన సంస్థల నిర్లక్ష్యంపై ప్రయాణికుల ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RGIA : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో ప్రయాణికుల కష్టాలు పెరిగిపోతున్నాయి. గమ్యస్థానాలకు సరిగ్గా చేరాల్సిన విమానాలు గంటల తరబడి ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. తాజాగా మరోసారి స్పైస్జెట్ విమానం ఆలస్యం కావడం విమానాశ్రయంలో కలకలం రేపింది.
ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన స్పైస్జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో మూడు గంటలుగా ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు విమానం బయలుదేరుతుందా అని ఎదురుచూస్తూ అలసిపోయిన ప్రయాణికులు ఎయిర్పోర్టులో ఆందోళనకు దిగారు. విమాన సిబ్బంది కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంతో ప్రయాగ్రాజ్ వెళ్లే ప్రయాణికులు మండిపడుతున్నారు.
Also Read
- Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
ఇదే నెలలో ఇదే స్పైస్జెట్ విమానం ఐదున్నర గంటల పాటు ఆలస్యమైన సంఘటన ఇంకా మరిచిపోక ముందే మరోసారి ఈ తరహా ఆలస్యాలు చోటుచేసుకోవడం విమానయాన సంస్థల నిర్లక్ష్యాన్ని అర్థమయ్యేలా చేస్తోంది. ఫిబ్రవరి 7న ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన విమానం పలు కారణాలతో ఐదున్నర గంటలు ఆలస్యం అవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం సాయంత్రం అయ్యే సరికి గమ్యస్థానానికి చేరలేదు. దీనిపై నిరసన వ్యక్తం చేసిన ప్రయాణికుల్లో హీరో విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ ప్రముఖులు, ఇద్దరు ఐఏఎస్లు, ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. “గంటల తరబడి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మా సమయాన్ని వృథా చేస్తున్నారు!” అంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక అంతకు ముందు రోజు మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గుహవాటి వెళ్లాల్సిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం రన్వేపైకి వెళ్లాక ఇంజిన్ మొరాయించింది! పైలెట్ అప్రమత్తమై వెంటనే ఏటీసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇంజనీరింగ్ నిపుణులు వెంటనే రంగంలోకి దిగారు. దాదాపు గంట పాటు లోపాన్ని సరిచేయడానికి ప్రయత్నించి ఎట్టకేలకు విమానాన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ రన్వేపైకి వెళ్లిన విమానం తిరిగి పార్కింగ్ బే వైపు రావడంతో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. చివరకు గంటన్నర ఆలస్యంగా విమానం గమ్యస్థానానికి బయలుదేరింది.
తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడం, ఆలస్యమైనా కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం పై విమానయాన సంస్థలపై ప్రయాణికుల అసహనం పెరుగుతోంది. “ఎప్పుడెప్పుడు బయలుదేరుతుందో చెప్పకుండా గంటల తరబడి నిలిపేస్తే ప్రయాణికుల పరిస్థితి ఏమిటి?” అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే డిమాండ్ మరింత బలపడుతోంది.
UP Encounter: యూపీలో ఎన్కౌంటర్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ హతం..
తాజావార్తలు
-
Kiara Advani: ప్రతి రిలేషన్ మనకు.. ఏదో ఒక పాఠం నేర్పుతుంది..
-
Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
-
Shreyas Iyer IPL Record: శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
-
Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!