గత గురువారం (మార్చి 6)న అమెరికాలోని చికాగో నుండి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల చికాగో విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ కావాల్సి వచ్చింది. అందుకు గల సాంకేతిక కారణంపై విమానయాన సంస్థ వివరణ ఇచ్చింది. ఎయిర్ ఇండియా తన దర్యాప్తులో పాలిథిన్ సంచులు, గుడ్డలు, బట్టలు వంటి వాటిని విమానం టాయిలెట్లలోకి నెట్టడం వల్ల టాయిలెట్లు మూసుకుపోయాయని.. అవి నిరుపయోగంగా మారాయని ఎయిర్ ఇండియా తెలిపింది.
RGIA : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో ప్రయాణికుల కష్టాలు పెరిగిపోతున్నాయి. గమ్యస్థానాలకు సరిగ్గా చేరాల్సిన విమానాలు గంటల తరబడి ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. తాజాగా మరోసారి స్పైస్జెట్ విమానం ఆలస్యం కావడం విమానాశ్రయంలో కలకలం రేపింది. ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన స్పైస్జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో మూడు గంటలుగా ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు విమానం బయలుదేరుతుందా అని ఎదురుచూస్తూ అలసిపోయిన ప్రయాణికులు ఎయిర్పోర్టులో…