Nampally Court నాంపల్లి కోర్టులో టీ. సర్కార్ కు చుక్కెదురు.. ఆ పిటిషన్ కొట్టివేత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో నాంపల్లి కోర్టులో తెలంగాణ సర్కార్ కు చుక్కెదురైంది. మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో నిందితుడైన రామచంద్ర భారతి బెయిల్ ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఉభయ పక్షాల వాదనలు విన్న తర్వాత నాంపల్లి సెషన్స్ కోర్టు ప్రభుత్వ పిటిషన్ ను కొట్టేసింది. రామచంద్ర భారతి బెయిల్ ను రద్దు చేయలేదు. బెయిల్ రద్దు చేయడానికి సరైన కారణాలు లేవని న్యాయస్థానం వ్యాఖ్యనించింది.
Also Read : Unstoppable: ‘బుల్ బుల్ అన్ స్టాపబుల్’ సాంగ్ రిలీజ్ చేసిన గోపీచంద్!
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
గత సంవత్సరం రామచంద్ర భారతి జైలు నుంచి విడుదల కాగానే బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అదే రోజు మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అర్జున్ రామచంద్ర భారతికి రిమాండ్ ను తిరస్కరించారు. రామచంద్ర భారతికి అదే రోజు బెయిల్ మంజూరు కూడా చేశారు. అనంతరం కొన్ని రోజుల వ్యవధిలోనే రామచంద్ర భారతికి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెషన్స్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ కేసును ఇవాళ విచారించిన నాంపల్లి సెషన్స్ కోర్టు.. తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ.. రామచంద్ర భారతి బెయిల్ రద్దు చేయడం కుదరని పేర్కొంది.
Also Read : India’s First C-295 Aircraft: టాటా, ఎయిర్బస్ కలిసి రూపొందిస్తున్న తొలి సైనిక విమానం
ఇదిలా ఉంటే ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసులో ప్రతివాదుల్లో ఉన్న సీఎం కేసీఆర్కు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసుల నుంచి కోర్టు మినహాయింపు ఇచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను పలుసార్లు కోర్టు విచారించినప్పటికీ అధికారికంగా నోటీసులు జారీ చేయలేదని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించడంతో దీనిపై శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసింది. తెలంగాణ పోలీసులు కూడా దర్యాప్తును సాగించవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
తాజావార్తలు
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..