Madanapalle Kidney Racket: మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో సంచలన విషయాలు.. ఒక్కో కిడ్నీ పాతిక లక్షలకు
- మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో సంచలన విషయాలు
- ఒక్కో కిడ్నీ పాతిక లక్షలకు
- రెండు అక్రమ కిడ్నీ ఆపరేషన్లను గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా చేపట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు అవసరమే కానీ, డబ్బు సంపాదించేందుకు మానవ అవయవాలతో వ్యాపారం చేయడం తప్పే కదా. అమాయకులకు డబ్బు ఎరగా చూపి దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు సంచలనం సృష్టిస్తోంది. నిందితుల రిమాండ్ రిపొర్టు లో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. రెండు అక్రమ కిడ్నీ ఆపరేషన్లను గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు ఒక్కో కిడ్నీ నీ పాతిక లక్షల అమ్మకానికి పెట్టినట్లు తెలిపారు.
Also Read:Andhra Pradesh:విశాఖలో మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ హోటల్ ప్రాజెక్ట్.. 2000 మందికి ఉపాధి
Also Read
- Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
- Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
కిడ్నీ దాత కావాలంటూ మదనపల్లె డయాలసిస్ సెంటర్ లో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న బాలు, కదిరి డయాలసిస్ సెంటర్ టెక్నీసియాన్ మెహరాజ్ లను పార్థసారథి రెడ్డి కోరాడు. వైజాగ్ జిల్లా గాజువాక కు చెందిన బ్రోకర్లు పద్మ, కాకర్ల సత్య, సూరిబాబుతో బాలు, మెహరాజ్ సంప్రదింపులు జరిపారు. వైజాగ్ చెందిన హారిక, యమునా తో ఆరు లక్షల రూపాయలు ఒప్పందం కుదిర్చిన బ్రోకర్లు.. కిడ్నీ ఆపరేషన్ చేయడానికి గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్ ఆంజనేయులకు ఒక్కో ఆపరేషన్ కు ఐదు లక్షల ఇచ్చేలా పార్థసారథి రెడ్డి డీల్ కుదుర్చుకున్నారు.
తొలిగా ఈనెల తొమ్మిదివ తేది ఉదయం వైజాగ్ కు చెందిన హారిక అనే యువతి కిడ్నిని తొలగించి మదనపల్లె చెందిన ముబాషిరా అమర్చడం ద్వారా 25 లక్షలు పొందారు నిందితులు. వచ్చిన డబ్బుల్లో డా. అంజనేయులు – రూ.5.5 లక్షలు, డా. పార్థసారథి – రూ. 4 లక్షలు, దాత హారిక – రూ. 6 లక్షలు మిగిలిన డబ్బును పంచుకున్న మెహరాజ్,బాలు. మరో కిడ్నిని సాయంత్రం యమున కు ఆపరేషన్ చేసి తొలగించారు పార్థసారథి రెడ్డి.. కిడ్నీ ఆపరేషన్ తర్వాత నొప్పి తట్టుకోలేక యమునా మృతి చెందింది. యమునా మృతి చెందడంతో గుట్టుచప్పుడు కాకుండా మదనపల్లి నుండి తిరుపతికి మృతదేహాన్ని తరలించారు. యమునతో సహజీవనం చేస్తున్న సూరిబాబుకు ఆరు లక్షల రూపాయల డబ్బులు ఇస్తామని ఇవ్వకపోవడం, యమునా మృతి చెందిందని చెప్పడంతో ఆందోళన చెంది పోలీసులకు సమాచారం ఇచ్చాడు సూరిబాబు..
పోలీసులకు సూరిబాబు సమాచారం ఇవ్వడంతో కిడ్నీ అమ్మకం వ్యవహారం బయటపడింది. తొలుత యమునకు పరీక్షలు నిర్వహించిన ఆంజనేయులు ఆమె శరీరం కిడ్నీ ఇవ్వడానికి సరిపోదంటూ తిప్పి పంపారు. అరెస్టు చేసిన వారిచ్చిన సమాచారంతో మరో 8 మంది పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటివరకు 15మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.. కేసులో కీలక నిందితుడిగా ఉన్న డాక్టర్ పార్థసారధి రెడ్డి కోసం తమిళనాడు, కర్నాటక, రాష్ట్రాల్లో గాలిస్తున్నారు పోలీసులు. యమునా కిడ్నీనీ గోవాకు చెందిన కిడ్నీ పేషంట్ రాజన్ దామోదర్ నాయక్ కు అమర్చినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!