Under-19 World Cup: సెమీఫైనల్లోకి భారత్.. ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Under-19 World Cup: అండర్-19 ప్రపంచ కప్లో భాగంగా ఆదివారం జరిగిన సూపర్ 6 మ్యాచ్లో పాకిస్థాన్పై భారత అండర్-19 జట్టు అద్భుతమైన విజయం సాధించి అండర్-19 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్లో చోటు దక్కించుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 253 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గెలుపు కోసం మైదానంలోకి దిగిన పాకిస్థాన్ అండర్-19 జట్టు కేవలం 194 పరుగులకే ఆలౌట్ అయింది. 58 పరుగుల భారీ విజయంతో టీమిండియా జట్టు విజయం సాధించింది.
READ ALSO: Police Act: తిరుపతి జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు.. ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ
Also Read
- Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
- Ramani Kalyanam : వీల్చైర్లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- 48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
253 పరుగుల లక్ష్యఛేదనలో పాక్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. ఉస్మాన్ ఖాన్ (66), హంజా జహూర్ (42), ఫర్హాన్ యూసఫ్ (38) పరుగులు నమోదు చేశారు. మిగతా బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో ఖిలాన్ పటేల్ 3, ఆయుష్ మాత్రే 3, అంబరీష్, హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ తీసుకున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌటైంది.
47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో ఉన్న టీమిండియాను వేదాంత్ త్రివేది (68; 98 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) కీలకమైన ఇన్నింగ్స్తో నిలబెట్టాడు. వైభవ్ సూర్యవంశీ (30; 22 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. కెప్టెన్ ఆయుష్ మాత్రే స్కోర్ చేయకుండానే వెనుదిరిగాడు. ఆర్.ఎస్.అంబరీష్ (29), విహాన్ మల్హోత్రా (21), అభిజ్ఞాన్ కుందు (16), ఆరోన్ జార్జ్ (16) పరుగులు నమోదు చేశారు. చివర్లో కనిష్క్ చౌహాన్ (35; 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), ఖిలాన్ పటేల్ (21; 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడటంతో భారత్ ఈ స్కోర్ సాధించింది. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మహ్మద్ సయ్యమ్ 2, అహ్మద్ హుస్సేన్, మోమిన్, అలీ రజా, అలీ హసన్ తలో వికెట్లు కూల్చారు. ఫిబ్రవరి 3న తొలి సెమీస్లో ఆస్ట్రేలియా -ఇంగ్లాండ్, ఫిబ్రవరి 4న రెండో సెమీ ఫైనల్లో భారత్ – అఫ్గానిస్థాన్ బరిలోకి దిగబోతున్నాయి.
READ ALSO: 2026 T20 World Cup: క్రికెట్ ఫ్యాన్స్కు బిగ్ షాక్.. ఈసారి వరల్డ్ కప్లో భారత్-పాక్ సమరం ఉండదు!
తాజావార్తలు
-
Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో!
-
GT Biggest Win: ఎస్ఆర్హెచ్పై గుజరాత్ చరిత్రాత్మక విజయం.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ విక్టరీ!
-
Avatar 3: ఫైనల్గా OTTలోకి ‘అవతార్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ramani Kalyanam : వీల్చైర్లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!