Under-19 World Cup: సెమీఫైనల్లోకి భారత్.. ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Under-19 World Cup: అండర్-19 ప్రపంచ కప్లో భాగంగా ఆదివారం జరిగిన సూపర్ 6 మ్యాచ్లో పాకిస్థాన్పై భారత అండర్-19 జట్టు అద్భుతమైన విజయం సాధించి అండర్-19 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్లో చోటు దక్కించుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 253 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గెలుపు కోసం మైదానంలోకి దిగిన పాకిస్థాన్ అండర్-19 జట్టు కేవలం 194 పరుగులకే ఆలౌట్ అయింది. 58 పరుగుల భారీ విజయంతో టీమిండియా జట్టు విజయం సాధించింది.
READ ALSO: Police Act: తిరుపతి జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు.. ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ
Also Read
- Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
253 పరుగుల లక్ష్యఛేదనలో పాక్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. ఉస్మాన్ ఖాన్ (66), హంజా జహూర్ (42), ఫర్హాన్ యూసఫ్ (38) పరుగులు నమోదు చేశారు. మిగతా బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో ఖిలాన్ పటేల్ 3, ఆయుష్ మాత్రే 3, అంబరీష్, హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ తీసుకున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌటైంది.
47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో ఉన్న టీమిండియాను వేదాంత్ త్రివేది (68; 98 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) కీలకమైన ఇన్నింగ్స్తో నిలబెట్టాడు. వైభవ్ సూర్యవంశీ (30; 22 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. కెప్టెన్ ఆయుష్ మాత్రే స్కోర్ చేయకుండానే వెనుదిరిగాడు. ఆర్.ఎస్.అంబరీష్ (29), విహాన్ మల్హోత్రా (21), అభిజ్ఞాన్ కుందు (16), ఆరోన్ జార్జ్ (16) పరుగులు నమోదు చేశారు. చివర్లో కనిష్క్ చౌహాన్ (35; 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), ఖిలాన్ పటేల్ (21; 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడటంతో భారత్ ఈ స్కోర్ సాధించింది. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మహ్మద్ సయ్యమ్ 2, అహ్మద్ హుస్సేన్, మోమిన్, అలీ రజా, అలీ హసన్ తలో వికెట్లు కూల్చారు. ఫిబ్రవరి 3న తొలి సెమీస్లో ఆస్ట్రేలియా -ఇంగ్లాండ్, ఫిబ్రవరి 4న రెండో సెమీ ఫైనల్లో భారత్ – అఫ్గానిస్థాన్ బరిలోకి దిగబోతున్నాయి.
READ ALSO: 2026 T20 World Cup: క్రికెట్ ఫ్యాన్స్కు బిగ్ షాక్.. ఈసారి వరల్డ్ కప్లో భారత్-పాక్ సమరం ఉండదు!
తాజావార్తలు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!