India WTC Ranking Drop: భారత్కు ఓటమి ఎఫెక్ట్.. టెస్ట్ ర్యాంకింగ్స్లో ఎన్ని పాయింట్లు కోల్పోయిందంటే.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India WTC Ranking Drop: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో ఓటమి పర్యవసానాలను భారత జట్టు ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్లో గట్టిగానే చవిచూసింది. ఓటమి అనంతరం WTC పాయింట్ల పట్టికలో టీమిండియా మూడవ స్థానం నుంచి నాల్గవ స్థానానికి పడిపోయింది. కోల్కత్తాలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా మూడవ రోజునే భారత్ను 30 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో పర్యాటక జట్టు రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారతదేశం 54.17 PCTని కలిగి ఉంది. ఈ WTC సైకిల్లో భారతదేశం ఎనిమిది టెస్ట్లు ఆడింది, వాటిలో నాలుగు గెలిచి, మూడింటిలో ఓడిపోయింది.
READ ALSO: Hindupuram: వైసీపీ ఆఫీసుపై దాడితో హీటెక్కిన హిందూపురం!
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
- Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
- OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
విజయంతో లాభపడిన దక్షిణాఫ్రికా..
కోల్కత్తాలో జరిగిన మొదటి టెస్ట్ మ్యా్చ్లో భారతదేశంపై విజయం సాధించడంతో దక్షిణాఫ్రికా బాగానే లాభపడింది. గతంలో ఈ పర్యాటక జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉండగా.. భారత్పై విజయం అనంతరం రెండవ స్థానానికి ఎగబాకింది. ఈ WTC సైకిల్లో దక్షిణాఫ్రికా జట్టు మూడు మ్యాచ్లు ఆడి, రెండు గెలిచి, ఒక మ్యాచ్లో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా PCT 66.67. దక్షిణాఫ్రికా 15 సంవత్సరాల తర్వాత భారతదేశంలో తన మొదటి టెస్ట్ను గెలుచుకుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లాండ్లో జరిగిన రెండు టెస్టుల్లో ఓడిపోయిన తర్వాత, ప్రస్తుత WTC సైకిల్లో భారత్ ఇప్పుడు మూడు టెస్టుల్లో ఓడిపోయింది. గత నెలలో పాకిస్థాన్లో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా తన టైటిల్ను కాపాడుకోవడానికి మంచి ఆరంభం ఇచ్చింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా జట్టు రెండింటిలో గెలిచింది. వారు PCT 66.67 పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నారు.
టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలో స్వదేశంలో 150 పరుగుల కంటే తక్కువ లక్ష్యాన్ని ఛేదించలేని రెండవ ఓటమిగా భారత్ జట్టు ఈ ఓటమిని మూటగట్టుకుంది. ఈ 21వ శతాబ్దంలో స్వదేశంలో 150 పరుగుల కంటే తక్కువ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఏ జట్టు కూడా ఓడిపోయిన చరిత్ర లేదు. గత ఏడాది వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 3-0 తేడాతో భారత్ను వైట్వాష్ చేసిన సంగతి తెలిసిందే.
READ ALSO: Mexico Gen Z Protests: మెక్సికోలో జెన్-జెడ్ తిరుగుబాటు! రోడ్లపైకి వేలాదిగా నిరసనకారులు..
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
-
Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!