2026 T20 World Cup: దాయాదుల పోరుకు బ్రేక్! భారత్-పాక్ మ్యాచ్ లేనట్లేనా?
- భారత్తో మ్యాచ్ ఆడబోమని చెప్పిన పాక్
- పాక్ ఆడకపోతే .. భారత్కు రెండు పాయింట్లు కేటాయించే ఛాన్స్
- పాకిస్థాన్ నిర్ణయంతో ICC నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 T20 World Cup: 2026 T20 ప్రపంచ కప్కు ముందు క్రికెట్ ఫ్యాన్స్కు బిగ్ షాక్ తగిలింది. పాకిస్థాన్ ప్రభుత్వం తమ జట్టు టోర్నమెంట్లో పాల్గొంటుందని, కానీ ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్తో జరిగే గ్రూప్ దశ మ్యాచ్ ఆడదని ప్రకటించింది. రాజకీయ, ఇటీవలి పరిణామాల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2026 T20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారతదేశం – శ్రీలంక కలిసి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే పాకిస్థాన్ జట్టు తన అన్ని మ్యాచ్లను శ్రీలంకలోనే ఆడుతుంది.
READ ALSO: Bihar: ప్రియుడు ఉండగా మరొకరితో పెళ్లికి రెడీ.. సీన్ కట్ చేస్తే ఎంత ఘోరానికి ఒడిగట్టిందంటే..!
Also Read
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
షాకింగ్ నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్..
పాకిస్థాన్ క్రికెట్ జట్టు శ్రీలంకకు వెళ్లడానికి పాక్ ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. అక్కడ వారి గ్రూప్ A మ్యాచ్లన్నీ కూడా షెడ్యూల్ అయ్యాయి. రాజకీయ కారణాల వల్ల పాకిస్థాన్ భారతదేశంలో ఆడటానికి నిరాకరించడంతో, భారతదేశం-పాకిస్థాన్ మ్యాచ్లను ICC తటస్థ వేదికలకు మార్చింది. రెండు జట్ల మధ్య మ్యాచ్లు కొలంబోలో జరగాల్సి ఉంది. తాజాగా పాకిస్థాన్ ఈ మెగా టోర్నీలో భారత్లో తలపడటానికి ససేమీరా అంటూ తేగేసి చెప్పింది. ఈ మ్యాచ్ను బహిష్కరించి, టోర్నమెంట్ నుంచి పూర్తిగా తొలగించబడకుండా ఉండేలా ప్లాన్ చేస్తుంది. వాస్తవానికి గతంలో పాకిస్థాన్ కూడా బంగ్లాదేశ్లా టోర్నమెంట్ నుంచి వైదొలుగుతామని బెదిరించింది.
తాజాగా పాకిస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గ్రూప్ దశలో రెండు పాయింట్లు కోల్పోతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ పాక్ ఆడకపోతే ఓటమిగా పరిగణిస్తారు. దీంతో భారత్ ఆడకుండానే రెండు పాయింట్లు అందుకుంటుంది. కానీ ఇది ICCకి గణనీయమైన ఆర్థిక నష్టంగా మారవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే భారతదేశం-పాకిస్థాన్ మ్యాచ్ ప్రపంచ కప్లో అత్యధికంగా వీక్షించే, ఆదాయాన్ని సంపాదించే మ్యాచ్. పాక్ నిర్ణయంతో ICC తో పాటు పాకిస్థాన్ కూడా గణనీయమైన నష్టాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ను తప్పుకున్న తర్వాత పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో భద్రతా సమస్యల కారణంగా బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నీలో పాల్గొనడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఐసిసి బంగ్లా జట్టును టోర్నీ నుంచి బహిష్కరించింది. బంగ్లాదేశ్కు మద్దతుగా టోర్నమెంట్ నుంచి వైదొలగాలని పాకిస్తాన్ గతంలో చర్చించింది, కానీ చివరికి భారత్ మ్యాచ్ను వదులుకోవాలని నిర్ణయించిందని సమాచారం.
READ ALSO: Honey Movie Trailer:’హనీ’ తప్పకుండా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా: హీరో నవీన్ చంద్ర
తాజావార్తలు
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..