Siddipet: తమ భూమిని కబ్జా చేశారు.. అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదంటూ జవాన్ సెల్ఫీ వీడియో
- తమ భూమిని కబ్జా చేశారు
- అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదంటూ జవాన్ సెల్ఫీ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ సంపద, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి బోర్డర్ లో విధులు నిర్వహిస్తున్న జవాన్లను కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జవాన్ల భూములను కబ్జా చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తమ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందంటూ జవాన్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ జవాన్ తమ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ జవాన్ గా పని చేస్తున్న సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి (మం) చౌదరిపల్లి గ్రామానికి చెందిన రామస్వామి.
Also Read:Nampally: అయాన్ కురుషి రౌడి షీటర్ హత్య.. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Also Read
గ్రామంలో కొందరు వ్యక్తులు భూమి కబ్జా చేశారని… అధికారుల చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగడం లేదంటూ సెల్ఫీ వీడియో తీశారు. ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఆర్డీవో, కలెక్టర్లు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని వాపోయాడు జవాన్. తమ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో పంపించాడు జవాన్ రామస్వామి. నేను దేశ సరిహద్దుల్లో పోరాడుతుంటే, సొంత ఊరిలో నా భూమి కబ్జా చేశారని వాపోతున్న జవాన్. తన భూమి తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని జవాన్ రామస్వామి వేడుకుంటున్నాడు. జై జవాన్ అని అనడమే తప్ప ఆచరణలో మాత్రం ప్రజల వైఖరి ఇలా ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
- Tags
- Encroached
- jawan
- Land
- Siddipet
- telangana
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..