Seema Haider: ఆమె పాకిస్థానీ జాతీయురాలా.. కాదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seema Haider: నోయిడా పోలీసులు తన భారతీయ ప్రేమికుడితో కలిసి జీవించడానికి భారతదేశంలోకి చొరబడిన పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్ నుంచి స్వాధీనం చేసుకున్న అన్ని పత్రాలను ఆమె గుర్తింపును ధృవీకరించడానికి ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి పంపారు. సీమా హైదర్ తన ప్రేమికుడు సచిన్ మీనాతో కలిసి జీవించడానికి మేలో తన నలుగురు పిల్లలతో అక్రమంగా నేపాల్ మీదుగా భారతదేశానికి వెళ్లిన తర్వాత ఆమె నిఘాలో ఉంది. జూలై 4న పోలీసులకు పట్టుబడినప్పటి నుంచి సీమా హైదర్ పాకిస్థాన్ గూఢచారి అనే అనుమానంతో భద్రతా ఏజన్సీల రాడార్లో ఉంది. సీమా హైదర్ పాస్పోర్ట్, పాకిస్తాన్ ఐడీ కార్డ్, ఆమె పిల్లల పాస్పోర్ట్లతో సహా పత్రాలను పోలీసులు దర్యాప్తులో స్వాధీనం చేసుకున్నారు. ఆమె పాకిస్థానీ జాతీయురాలా కాదా అని నిర్ధారించుకోవడానికి ఈ పత్రాలన్నీ పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి పంపబడ్డాయి.
Also Read: Indonesia: ఇండోనేషియాలో పడవ మునిగి 15 మంది మృతి.. 19 మంది గల్లంతు
Also Read
- Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
- SS Rajamouli: "ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది".. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
- 55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
- Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
కాగా, సీమా హైదర్ మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.ఓ ఇంటర్య్వూలో.. సీమా హైదర్ తన ఫోన్ నుండి ఎలాంటి డేటాను తొలగించలేదని పేర్కొంది. తదుపరి విచారణ కోసం పోలీసులు ఆమె స్వాధీనం చేసుకున్న మొబైల్ను ఘజియాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఫోరెన్సిక్ నివేదిక, పాకిస్తాన్ నుంచి సీమా హైదర్ గుర్తింపు నిర్ధారణ రెండూ పెండింగ్లో ఉన్నాయి. ఇవి వచ్చే వరకు దర్యాప్తు కొనసాగుతుంది. వీటిని నిర్ధారించిన తర్వాత కేసుకు సంబంధించి చార్జిషీట్ను సిద్ధం చేస్తారు.
Also Read: Twitter Logo: కనుమరుగుకానున్న ట్విట్టర్ పిట్ట.. కొత్త లోగో ‘ఎక్స్’!
ఇదిలా ఉండగా.. సచిన్ మీనా, సీమా హైదర్లకు సంబంధించిన పత్రాలు, ఆధార్ కార్డులలో మార్పులు చేశారనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్కు చెందిన ఇద్దరు సోదరులను ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. నిందితులు పుష్పేంద్ర మీనా, అతని సోదరుడు పవన్ను వారు పనిచేసిన అహ్మద్గఢ్లోని పబ్లిక్ సర్వీస్ సెంటర్ నుండి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు సచిన్ మీనా బంధువు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పుడు వారిని విచారిస్తున్నారు. సీమా హైదర్ (30), సచిన్ మీనా (22) 2019లో ఆన్లైన్ మొబైల్ గేమ్ పబ్జీ ఆడుతున్నప్పుడు వర్చువల్గా కలుసుకున్నారు. ఈ సంవత్సరం చివర్లో, సీమా హైదర్ అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి, మొదట పాకిస్తాన్ నుండి దుబాయ్ తరువాత నేపాల్కు ప్రయాణించారు. ఆమె ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లాలోని గ్రేటర్ నోయిడాలో సచిన్ మీనాతో కలిసి ఉంటోంది. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ వర్గాల సమాచారం ప్రకారం, సీమా హైదర్ గతంలో పబ్జీ ద్వారా భారతదేశంలోని అనేక మంది వ్యక్తులతో టచ్లో ఉన్నారు. సీమా హైదర్ పబ్జీ ద్వారా ఢిల్లీ-ఎన్సీఆర్లోని వ్యక్తులను ఎక్కువగా సంప్రదించినట్లు విచారణలో వెల్లడైంది.
తాజావార్తలు
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
-
Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
-
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!