Seema Haider : భారత ప్రభుత్వం సాయం కోరిన సీమా హైదర్ మొదటి భర్త.. పిల్లల గురించి ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seema Haider : సీమా హైదర్ ఈ పేరు గత కొన్నాళ్లుగా పాక్, భారత్ రెండు దేశాల్లో మార్మోగిపోతుంది. 2023లో తన నలుగురు పిల్లలతో అక్రమంగా భారతదేశానికి వచ్చిన పాకిస్తానీ మహిళ సీమా మొదటి భర్త, తన పిల్లలను కలవడానికి, వారిని తన వద్ద ఉంచుకోవడానికి సహాయం చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. సీమ ఆన్లైన్లో పరిచయమైన తన ప్రియుడితో కలిసి జీవించడానికి భారతదేశానికి వచ్చింది. సీమా మొదటి భర్త గులాం హైదర్ ఇటీవలి వీడియో సందేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ పాకిస్తాన్ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నీ సహాయంతో 2023 చివరి నుండి తన పిల్లల కస్టడీని పొందడానికి ప్రయత్నిస్తున్నానని హైదర్ పేర్కొన్నారు.
Read Also:Elon Musk: డిగ్రీ లేకున్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వొచ్చంటున్న మస్క్
Also Read
గత ఏడాది ఫిబ్రవరిలో హైదర్ తన సహాయం కోరాడని.. భారత కోర్టులలో చట్టపరమైన చర్యలను ప్రారంభించడానికి ఒక భారతీయ న్యాయవాదిని నియమించుకున్నాడని బర్నీ ధృవీకరించాడు. తగిన ప్రక్రియ తర్వాత భారతీయ న్యాయవాది అలీ మోమిన్ సేవలను ఉపయోగించుకున్నామని.. భారత కోర్టులలో చట్టపరమైన చర్యలను ప్రారంభించడానికి వకలత్నామాను పంపామని ఆయన చెప్పారు. కానీ కేసు ప్రారంభించబడిందా లేదా అనేది స్పష్టంగా లేదు. కోర్టులో కేసు పెండింగ్లో ఉండి ఏడాది గడిచిందని, 2023 నుండి తన పిల్లలను చూడలేదని హైదర్ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
Read Also:Mahesh Babu : 20 నిమిషాల వైల్డ్ ఫైర్ .. డూప్ లేకుండా మహేష్ బాబుతో షూట్కు జక్కన్న ప్లాన్?
సీమా యుఎఇ, నేపాల్ మీదుగా భారతదేశానికి వచ్చినప్పుడు గులాం హైదర్ సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. మే 2023లో తన నలుగురు పిల్లలూ ఏడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు. ఒక ఇంటర్వ్యూలో సీమా తాను హిందూ మతాన్ని స్వీకరించినట్లు చెప్పింది. సీమా పాకిస్తాన్ వెళ్లడానికి స్పష్టంగా నిరాకరించింది. తన పిల్లలు కూడా హిందూ మతాన్ని స్వీకరించారని ఆయన పేర్కొన్నారు. సీమా ఇటీవల ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పోస్ట్ చేసి, సచిన్తో కలిసి తాను తల్లి కాబోతున్నానని చెప్పింది. సీమా సింధ్ ప్రావిన్స్లోని జాకోబాబాద్ నివాసి. మే 2023లో కరాచీలోని తన ఇంటి నుండి నేపాల్ మీదుగా తన పిల్లలతో కలిసి భారతదేశానికి వచ్చింది. జూలై 2023లో ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో భారతీయ జాతీయుడు సచిన్ మీనాతో నివసిస్తున్నట్లు భారత అధికారులు గుర్తించినప్పుడు ఆమె వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ వివాహం చేసుకున్నారని సచిన్ పేర్కొన్నాడు. వారిద్దరూ 2019 లో ఆన్లైన్ గేమ్ PUBG ఆడుతున్నప్పుడు పరిచయం అయ్యారు. సీమా, సచిన్లను జూలై 2023లో అరెస్టు చేశారు. కానీ తరువాత బెయిల్పై విడుదల చేశారు. సరిహద్దు గుండా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు ఆమె పై అభియోగాలు మోపగా, అక్రమ వలసదారునికి ఆశ్రయం కల్పించినందుకు సచిన్పై అభియోగాలు మోపారు.
తాజావార్తలు
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!