Kolkata: 28 నుంచి 144 సెక్షన్.. మోడీ రోడ్ షో అడ్డుకునేందుకేనన్న బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మే 28 నుంచి కోల్కతాలో పోలీసులు 144 సెక్షన్ను విధించారు. హింసాత్మక నిరసనలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం కారణంగా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడవద్దని 60 రోజుల పాటు పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసుల ఆంక్షలపై బీజేపీ మండిపడుతోంది. మే 28న కోల్కతాలో ప్రధాని మోడీ రోడ్షో ఉంది. ఈ ర్యాలీని ఆపడానికే సీఎం మమత నిరంకుశ చర్యకు పాల్పడుతున్నారని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Ap High Court: పిన్నెల్లికి షాకిచ్చిన హైకోర్టు..కౌంటింగ్ రోజు మాచర్లకు వెళ్లొద్దని ఆదేశం
Also Read
- Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
కోల్కతా పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 144ను అమలు చేశారు. మే 28 నుంచి 60 రోజుల పాటు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడవద్దని ఆదేశించింది. ఇంటెలిజెన్స్ సూచించిన ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హింసాత్మక నిరసనలు ప్రజా శాంతి మరియు ప్రశాంతతకు గణనీయమైన అంతరాయాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Medha Patkar: మేధా పాట్కర్కు షాక్.. పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారణ
28.05.2024 నుంచి 26.07.2024 వరకు 60 రోజుల పాటు లేదా హింసాత్మక ప్రదర్శనలు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ఆధారంగా తదుపరి ఆర్డర్ వరకు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు చట్టవిరుద్ధంగా సమావేశాన్ని నిషేధిస్తూ కోల్కతా కమీషనర్ ఆఫ్ పోలీస్ IPC సెక్షన్ 144ను విధించారు. ప్రజల ప్రశాంతతకు పెద్ద ఎత్తున విఘాతం ఏర్పడి శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని సీపీ వినీత్ కుమార్ గోయల్ ఆర్డర్ జారీ చేశారు.
బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ స్పందిస్తూ.. ప్రధాని మోడీ రోడ్షోను ఆపడానికే పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఐదు దశల ఎన్నికల తర్వాత ప్రజల అభీష్టాన్ని పసిగట్టిన సీఎం మమత ఇప్పుడు భయపడుతున్నారన్నారు. 144ని అమలు చేసి మోడీ రోడ్షోను ఆపాలని ఆమె పోలీసులను ఆదేశించారని తెలిపారు.
ఇది కూడా చదవండి: Hyderabad: బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీరైన భార్యను చంపిన భర్త..
తాజావార్తలు
-
SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!