G-20 Summit: రెండోరోజు G20 సమావేశాలు.. వాటిపైనే చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G-20 Summit: భారతదేశ రాజధాని ఢిల్లీలో రెండో రోజు జీ20 సమావేవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం రాజ్ఘాట్లో మహాత్మ గాంధీకి ప్రపంచ నేతలు నివాళులర్పించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, కెనడా పీఎం జస్టిన్ ట్రూడో,ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ పీఎం ఫుమియో కిషిడా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్లతో పాటు పలువురు నేతలు మహాత్మ గాంధీకి నివాళులు అర్పించడానికి రాజ్ ఘాట్ కు చేరుకున్నారు. వారందరికి ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు. అనంతరం వారంతా రాజ్ఘాట్లో మహాత్మ గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు.
Also Read: Cyber Crime: నటికి టోకరా.. సెకన్లలో లక్ష నొక్కేశారు
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఇక ఈరోజు మధ్యాహ్నం మద్యాహ్నం 12:30 గంటల వరకు భారత మండపంలో ఒకే భవిష్యత్ అంశం పై చర్చలు జరగున్నాయి. ఇక జీ20 మొదటి రోజు సమావేశంలో జీవ ఇంధనంపై ప్రపంచ కూటమిని ప్రారంభిస్తున్నట్లు మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఢిల్లీ డిక్లరేషన్ ను కూడా కూటమి దేశాలు అంగీకరించాయి. ఒకే భవిష్యత్ అంశం చర్చ తరువాత నేడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ తో ప్రధాని మోడీకి వర్కింగ్ లంచ్ ఉండనుంది. అనంతరం విడిగా కెనడా దేశాధినేతతో సమావేశం కానున్నారు ప్రధాని మోడీ. ఆ తర్వాత వరుసగా కొమొరోస్, తుర్కియే (టర్కీ), యూఏఈ, దక్షిణ కొరియా, యురోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా అధినేతలతో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇక పలు కీలక అంశాలపై రంగాల వారీగా ఆయా దేశాలతో భారత్ పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాదికి జీ1 అధ్యక్ష బాధ్యతను భారత్ బ్రెజిల్ కు అప్పగించనుంది. ఆఫ్రికన్ యూనియన్ కు నిన్న జరిగిన సమావేశంలో శాశ్వత సభ్యత్వం ప్రకటించడంతో జీ20 సదస్సు ఇకపై జీ21 సదస్సు కానుంది. మొదటి జీ21 సదస్సుకు బ్రెజిల్ వేదిక కానుంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!