Maldives: మా దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడండి.. మాల్దీవులు మంత్రి అభ్యర్థన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయుల రాకతో టూరిజం పరంగా అభివృద్ధి చెందిన మాల్దీవులు ఇప్పుడు కుదేలు పడుతోంది. భారత టూరిస్టులు మాల్దీవులకు బదులుగా లక్షదీప్ కు వెళ్తుండటంతో మల్దీవులు పర్యాటకం దివాళా తీసింది. తాజాగా ఈ అంశంపై ఆ దేశ టూరిజం శాఖ మంత్రి ఇబ్రహీం ఫైజల్ మాట్లాడుతూ.. భారతీయులు మాల్దీవులకు రావాలని, పర్యాటకంపైనే ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని అభ్యర్థించారు. ఆయన సోమవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. భారత్, మాల్దీవులు మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని అన్నారు. కొత్తగా ఎన్నికైన తమ దేశ ప్రభుత్వం భారత్లో కలిసి పనిచేయాలని అనుకొంటున్నదని వెల్లడించారు. తాము ఎల్లప్పుడూ శాంతియుత, స్నేహపూర్వక వాతావరణాన్ని కోరుకుంటామని పేర్కొన్నారు.
READ MORE: Kishan Reddy: నేను ధైర్యంగా చెప్తున్నా.. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు వస్తాయి..
Also Read
- Astrology: మే 23 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
మాల్దీవుల అధ్యక్షుడిగా ముయిజ్జు బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు దేశాల మధ్య ద్వై పాక్షిక సంబంధాలు సైతం క్షీణించాయి. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత మొదలైన చర్చ మాల్దీవులకు చేరుకుంది. భారత ప్రధాని మోడీపై, భారత్పై మాల్దీవులు మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాల్దీవుల నేతల వ్యాఖ్యల వల్ల అక్కడి పర్యాటక రంగానికి నష్టం వాటిల్లింది. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, సచిన్ తెందూల్కర్ వంటి భారత ప్రముఖులు కూడా భారత తీరాలు, ద్వీపాల ప్రాధాన్యంపై మాట్లాడారు.ఈ చర్చ మొత్తం ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనతో మొదలైంది. మోదీ లక్షద్వీప్ పర్యటన చిత్రాలను చూసిన తర్వాత సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ఇక సెలవులకు మాల్దీవులకు బదులుగా లక్షద్వీప్కు వెళ్లండని చెప్పడం ప్రారంభించారు. లక్షదీప్ లో పర్యాటక రంగం అభివృద్ధి చెందడం కోసం భారత్ కి చెందిన పెద్ద కంపెనీలు అక్కడ హోటల్స్ కట్టడం ప్రారంభించారు. మన దేశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు చిన్న దేశమైన మాల్దీవులు ఆర్థిక పరిస్థితి రాను రాను కుంచించుకుపోతోంది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పలువురు మంత్రులను సైతం ఆ ప్రభుత్వం తొలగించింది.
తాజావార్తలు
-
Pat Cummins: “అభిషేక్, ఇషాన్, క్లాసెన్ కాదు.. వాళ్ల వల్లే మ్యాచ్ గెలిచాం”.. SRH కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
-
Mega158: ‘మెగా158’ టైటిల్పై హింట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి?
-
Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’కి డబుల్ మ్యూజిక్ ట్రీట్..
-
Patriot: 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి – మోహన్ లాల్ కలయిక.. ‘పేట్రియాట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!