Satyavathi Rathod : ఇన్ని రోజులు మీరు చెప్పింది అబద్దం అని క్షమాపణ చెప్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే.. సుప్రీంలో ఉన్న కేసుల పరిష్కారం తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందిందనీ.. తెలంగాణ బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లు 2017లో హోంశాఖకు చేరిందన్నారు. ప్రస్తుతం ఈ రిజర్వేషన్ల కేసు సుప్రీంలో పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. సుప్రీం కోర్టులో కేసుల పరిష్కారం తర్వాతే రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని లేఖలో వివరించింది కేంద్రం. అయితే.. దీనిపై తాజాగా తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం మళ్ళీ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ గిరిజనులకు అన్యాయం చేసిందన్నారు.
Also Read : Damodar Raja Narasimha : కాంగ్రెస్కు కోవర్ట్ రోగం పట్టింది
గిరిజన రిజర్వేషన్లు 10 శాతం పెంచాలని కేసిఆర్ ఆలోచన చేశారని, సెప్టెంబర్ 17న గిరిజన బంజారా భవన్లు ప్రారంభించి 10 శాతం పెంచుతామని సీఎం కేసిఆర్ సభలో ప్రకటన చేశారన్నారు. సుప్రీం కోర్టులో కేసు ఉందని, కేంద్ర మంత్రి అర్జున్ ముండా పార్లమెంట్ లో ప్రకటన చేశారని, 9వ షెడ్యూల్ లో పెట్టి రాష్ట్రపతి చేత ఆమోదం తెలపాలని చెప్పినా కేంద్రము నుంచి స్పందన లేదని ఆమె మండిపడ్డారు. ఇన్ని రోజులు మీరు చెప్పింది అబద్దం అని క్షమాపణ చెప్తారా? అని ఆమె ప్రశ్నించారు. కేంద్రం గిరిజన రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోకపోతేత బీజేపీ నేతలను తెలంగాణలో తిరగనివ్వరని ఆమె ధ్వజమెత్తారు. కచ్చితంగా అడ్డుకుంటామని, గిరిజన రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీయం బాపు రావు వైఖరీ ఏంటో చెప్పాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఓట్లు వేయించుకోవడానికి గిరిజనులను చూస్తున్నారు తప్ప పట్టించు కోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Naresh Gujral: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల సైబర్ మోసం.. వాట్సాప్ మెసేజ్ తో కొల్లకొగొట్టేసారు.!
- BCCI: క్రికెట్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్.. IPL 2027 షెడ్యూల్పై బీసీసీఐ సంచలన నిర్ణయం
- Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
- PF Withdrawal Via UPI-ATM: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం..
- Tags
- bjp
- breaking news
- BRS
- cm kcr
- latest news
తాజావార్తలు
-
Dowry Harassment: తల్లికి ఫోన్.. తర్వాత గదిలో ఉరి.. పెళ్లయిన 45రోజులకే భార్య ఆత్మహత్య!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Naresh Gujral: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల సైబర్ మోసం.. వాట్సాప్ మెసేజ్ తో కొల్లకొగొట్టేసారు.!
-
OnePlus Pad 3 Pro: వన్ప్లస్ ప్యాడ్ 3 ప్రో టాబ్లెట్ విడుదల.. 13,380mAh బ్యాటరీ, 16GB RAM
-
BCCI: క్రికెట్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్.. IPL 2027 షెడ్యూల్పై బీసీసీఐ సంచలన నిర్ణయం
ట్రెండింగ్
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!