Saturday Remedies: శనివారం నాడు ఈ పరిహారం చేస్తే.. ఊహించని డబ్బు మీ సొంతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urad Dal Saturday Remedies for Money And Wealth: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడుని ‘న్యాయ దేవత’గా పరిగణిస్తారు. ఓ వ్యక్తి యొక్క మంచి, చెడు కర్మల ఫలాన్ని శని దేవుడు నిర్ణయిస్తాడు. ఓ వ్యక్తి జాతకంలో శని బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే సమయంలో శని బలంగా ఉంటే.. ఆ వ్యక్తి జీవితంలో అపారమైన పురోభివృద్ధిని, విజయాన్ని సాధిస్తాడు. అందుకే ఓ వ్యక్తి జీవితంలో శని కీలక పాత్ర పోషిస్తుంది. ఎవరూ కూడా శని గ్రహానికి గురవాలని కోరుకోరు. శని శనిదోషం ఉంటే నివారణ చర్యలు లేదా పరిహారం చేసి శని దేవుని అనుగ్రహం పొందుతారు.
ఓ వ్యక్తి తన జీవితంలో ఆనందం, శ్రేయస్సు పొందడానికి జ్యోతిష్యశాస్త్రంలో అనేక చర్యలు ఇవ్వబడ్డాయి. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆశీర్వాదాలు పొందడానికి మినప పప్పుకు సంబంధించిన కొన్ని చర్యలు జ్యోతిషశాస్త్రంలో చెప్పబడ్డాయి. శనివారం రోజున మినప పప్పుతో పరిహారం చేస్తే వ్యక్తి జీవితం బాగుంటుందట. ఊహించని సంపద లభిస్తుందట. మినప పప్పుతో చేయాల్సిన కొన్ని నివారణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
- ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
# ఓ వ్యక్తి శని దోషంతో ఇబ్బంది పడుతుంటే.. మినప పప్పు యొక్క ఈ పరిహారం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. శనివారం నాడు శని దేవుడిని ఆరాధించండి. పూజలో మినప పప్పు ఉపయోగించండి. పూజ తరువాత మీ తల మీదుగా 3-4 గింజలను తీసివేసి.. కాకికి వేయండి. దీంతో శని దోష ప్రభావం తొలగిపోతుంది.
# జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క పనికి పదే పదే ఆటంకాలు జరిగినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా పని జరగకపోయినా.. శనివారం సాయంత్రం కొన్ని మినప గింజలను తీసుకొని వాటిని రావి చెట్టు కింద పోయాలి. పోసాక వెనక్కి తిరిగి చూడొద్దు. ఈ పరిహారాన్ని 11 శనివారాలు చేయడం వల్ల పనిలో ఆటంకాలు తొలగిపోతాయి.
# జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే.. శనివారం రాత్రి ఒక పాత్రలో ఆవ నూనెను మీ తల దగ్గర పెట్టుకోండి. మరుసటి రోజు ఉదయం ఈ నూనెలో కుడుములు ఉడకబెట్టి.. పేదలకు ఇవ్వండి. దీనివల్ల మీ ఇంట్లో సంపద రాక మొదలవుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది.
# జ్యోతిష్యం ప్రకారం కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నట్లయితే ఇనుప వస్తువు కొనాలి. మీరు వ్యాపారం చేయబోయే ప్రదేశంలో ఉంచి స్వస్తిక్ గుర్తు రాయండి. ఆపై కొన్ని మినప పప్పు గింజలను అక్కడ ఉంచండి. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో పురోగతి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Gold Today Price: మగువలకు శుభవార్త.. నేటి బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే?
తాజావార్తలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
-
SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
Anna Lezhneva: జిమ్’లో వర్కౌట్స్ మొదలెట్టిన పవన్ భార్య
-
Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
ట్రెండింగ్
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..