Saturday Remedies: శనివారం నాడు ఈ పరిహారం చేస్తే.. ఊహించని డబ్బు మీ సొంతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urad Dal Saturday Remedies for Money And Wealth: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడుని ‘న్యాయ దేవత’గా పరిగణిస్తారు. ఓ వ్యక్తి యొక్క మంచి, చెడు కర్మల ఫలాన్ని శని దేవుడు నిర్ణయిస్తాడు. ఓ వ్యక్తి జాతకంలో శని బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే సమయంలో శని బలంగా ఉంటే.. ఆ వ్యక్తి జీవితంలో అపారమైన పురోభివృద్ధిని, విజయాన్ని సాధిస్తాడు. అందుకే ఓ వ్యక్తి జీవితంలో శని కీలక పాత్ర పోషిస్తుంది. ఎవరూ కూడా శని గ్రహానికి గురవాలని కోరుకోరు. శని శనిదోషం ఉంటే నివారణ చర్యలు లేదా పరిహారం చేసి శని దేవుని అనుగ్రహం పొందుతారు.
ఓ వ్యక్తి తన జీవితంలో ఆనందం, శ్రేయస్సు పొందడానికి జ్యోతిష్యశాస్త్రంలో అనేక చర్యలు ఇవ్వబడ్డాయి. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆశీర్వాదాలు పొందడానికి మినప పప్పుకు సంబంధించిన కొన్ని చర్యలు జ్యోతిషశాస్త్రంలో చెప్పబడ్డాయి. శనివారం రోజున మినప పప్పుతో పరిహారం చేస్తే వ్యక్తి జీవితం బాగుంటుందట. ఊహించని సంపద లభిస్తుందట. మినప పప్పుతో చేయాల్సిన కొన్ని నివారణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
# ఓ వ్యక్తి శని దోషంతో ఇబ్బంది పడుతుంటే.. మినప పప్పు యొక్క ఈ పరిహారం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. శనివారం నాడు శని దేవుడిని ఆరాధించండి. పూజలో మినప పప్పు ఉపయోగించండి. పూజ తరువాత మీ తల మీదుగా 3-4 గింజలను తీసివేసి.. కాకికి వేయండి. దీంతో శని దోష ప్రభావం తొలగిపోతుంది.
# జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క పనికి పదే పదే ఆటంకాలు జరిగినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా పని జరగకపోయినా.. శనివారం సాయంత్రం కొన్ని మినప గింజలను తీసుకొని వాటిని రావి చెట్టు కింద పోయాలి. పోసాక వెనక్కి తిరిగి చూడొద్దు. ఈ పరిహారాన్ని 11 శనివారాలు చేయడం వల్ల పనిలో ఆటంకాలు తొలగిపోతాయి.
# జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే.. శనివారం రాత్రి ఒక పాత్రలో ఆవ నూనెను మీ తల దగ్గర పెట్టుకోండి. మరుసటి రోజు ఉదయం ఈ నూనెలో కుడుములు ఉడకబెట్టి.. పేదలకు ఇవ్వండి. దీనివల్ల మీ ఇంట్లో సంపద రాక మొదలవుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది.
# జ్యోతిష్యం ప్రకారం కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నట్లయితే ఇనుప వస్తువు కొనాలి. మీరు వ్యాపారం చేయబోయే ప్రదేశంలో ఉంచి స్వస్తిక్ గుర్తు రాయండి. ఆపై కొన్ని మినప పప్పు గింజలను అక్కడ ఉంచండి. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో పురోగతి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Gold Today Price: మగువలకు శుభవార్త.. నేటి బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే?
తాజావార్తలు
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?