Sankranthi 2025: సీసీ కెమెరాలపై దుస్తులు కప్పి.. 5 లక్షల విలువైన కోళ్లను ఎత్తుకెళ్లిన దొంగలు!
- తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
- తేలప్రోలులో కోళ్లను ఎత్తుకెళ్లిన దొంగలు
- కంకిపాడులో వైభవంగా ఎడ్ల పందేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సంక్రాంతి పండుగ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది కోడి పందేలు. ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో పందేలు కాయడానికి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు. అయితే పందేల సమయంలో చాలా కోళ్లు అపహరణకు గురవుతాయి. తాజాగా ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లా తేలప్రోలులో చోటుచేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 15 కోళ్లను దొంగలు ఎత్తుకెళ్లారు.
కృష్ణా జిల్లా తేలప్రోలులో ఆదివారం తెల్లవారుజామున కోడిపుంజుల చోరీ జరిగింది. తేలప్రోలులోని చిన్న బజారుకు చెందిన మణికంఠ రెడ్డి స్థలంలో సుమారుగా రూ.5 లక్షల విలువ చేసే పదిహేను కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. దుండగులు సీసీ కెమెరాలపై దుస్తుల కప్పి కోళ్లను తీసుకువెళ్లారు. బాధితుడు మణికంఠ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఇందులో కొన్ని కోళ్లు కోడి పందేల కోసం పెంచారట. ఇది తెలిసిన వారి పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read
- New Oppo: టెక్ లవర్స్ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
మరోవైపు కృష్ణా జిల్లా కంకిపాడులో ఎడ్ల పందేలను వైభవంగా నిర్వహిస్తున్నారు. జనసేన జెండాలతో ఎడ్ల బండ్లను సిద్ధం చేశారు. ఒకొక్క బండికి ఆరు నిముషాల సమయం ఇస్తూ ఎడ్ల పందాలు నిర్వహించారు. ఈ పందేలను చూడటానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి జనాలు వచ్చారు. మహిళలు సైతం ఈ పోటీలలో పాల్గొనడం విశేషం. రైతుకు ఎంతో ఉపయోగపడే ఎడ్లను సంతోషపరచడానికి, వాటిపైన ప్రేమతోనే ఈ పందేలు నిర్వహిస్తున్నాం అని నిర్వాహకులు అంటున్నారు.
తాజావార్తలు
-
New Oppo: టెక్ లవర్స్ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!