Sankranthi 2025: సీసీ కెమెరాలపై దుస్తులు కప్పి.. 5 లక్షల విలువైన కోళ్లను ఎత్తుకెళ్లిన దొంగలు!
- తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
- తేలప్రోలులో కోళ్లను ఎత్తుకెళ్లిన దొంగలు
- కంకిపాడులో వైభవంగా ఎడ్ల పందేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సంక్రాంతి పండుగ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది కోడి పందేలు. ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో పందేలు కాయడానికి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు. అయితే పందేల సమయంలో చాలా కోళ్లు అపహరణకు గురవుతాయి. తాజాగా ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లా తేలప్రోలులో చోటుచేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 15 కోళ్లను దొంగలు ఎత్తుకెళ్లారు.
కృష్ణా జిల్లా తేలప్రోలులో ఆదివారం తెల్లవారుజామున కోడిపుంజుల చోరీ జరిగింది. తేలప్రోలులోని చిన్న బజారుకు చెందిన మణికంఠ రెడ్డి స్థలంలో సుమారుగా రూ.5 లక్షల విలువ చేసే పదిహేను కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. దుండగులు సీసీ కెమెరాలపై దుస్తుల కప్పి కోళ్లను తీసుకువెళ్లారు. బాధితుడు మణికంఠ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఇందులో కొన్ని కోళ్లు కోడి పందేల కోసం పెంచారట. ఇది తెలిసిన వారి పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read
- CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
- Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
- China: గాల్వాన్ జనరల్పై జిన్పింగ్ వేటు.. భారత్కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్కు షాక్
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
మరోవైపు కృష్ణా జిల్లా కంకిపాడులో ఎడ్ల పందేలను వైభవంగా నిర్వహిస్తున్నారు. జనసేన జెండాలతో ఎడ్ల బండ్లను సిద్ధం చేశారు. ఒకొక్క బండికి ఆరు నిముషాల సమయం ఇస్తూ ఎడ్ల పందాలు నిర్వహించారు. ఈ పందేలను చూడటానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి జనాలు వచ్చారు. మహిళలు సైతం ఈ పోటీలలో పాల్గొనడం విశేషం. రైతుకు ఎంతో ఉపయోగపడే ఎడ్లను సంతోషపరచడానికి, వాటిపైన ప్రేమతోనే ఈ పందేలు నిర్వహిస్తున్నాం అని నిర్వాహకులు అంటున్నారు.
తాజావార్తలు
-
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
-
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
-
CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
-
Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
-
China: గాల్వాన్ జనరల్పై జిన్పింగ్ వేటు.. భారత్కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్కు షాక్
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!