Sand Mafia: హైదరాబాద్లో ఇసుక మాఫియా.. పదివేలకు కొని యాభైవేలకు అమ్ముతున్న కేటుగాళ్లు
- హైదరాబాద్లో జోరుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా, ఇసుక నిల్వలు, విక్రయం.
- ఇసుక రీచ్ల నుంచి 10,000 రూపాయలకు ఒక లారీ ఇసుకను కొనుగోలు
- హైదరాబాద్లో 50,000 రూపాయలకు విక్రయాలు.
- నగర శివారులో అధికారికంగా గుర్తించబడని పలుచోట్ల ఇసుక డంప్ యార్డులు.
- అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sand Mafia: హైదరాబాద్లో ఇసుక అక్రమ రవాణా, ఇసుక నిల్వలు, విక్రయం జోరుగా సాగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. వివిధ జిల్లాల్లోని ఇసుక రీచ్ల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్న మాఫియా అరాచకాలు మితిమీరుతున్నాయి. ఈ అక్రమ దందాపై టాస్క్ ఫోర్స్ విభాగం దృష్టి సారించి పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తోంది. జిల్లాలలోని ఇసుక రీచ్ల నుంచి లారీల ద్వారా ఇసుకను సరఫరా చేయించుకునే మాఫియా 10,000 రూపాయలకు ఒక లారీ ఇసుకను కొనుగోలు చేస్తోంది. అయితే, అదే ఇసుకను హైదరాబాద్లో 50,000 రూపాయలకు విక్రయిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తోంది. ప్రధానంగా, నది తీర ప్రాంతాలకు డెలివరీ పేరుతో బుక్ చేసుకొని నిజానికి హైదరాబాదులో డంప్ చేస్తోంది.
Read Also: Maharashtra: మహాయుతి కూటమిలో చీలిక.. షిండే ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ తగ్గింపు
Also Read
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
హైదరాబాద్లోని సికింద్రాబాద్, తాడ్బండ్, అలాగే నగర శివారులో పలుచోట్ల ఇసుక డంప్ యార్డులు ఏర్పాటయ్యాయి. ఇవి అధికారికంగా గుర్తించబడని నిల్వ కేంద్రాలుగా మారాయి. టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఇసుక అక్రమ నిల్వలను గుర్తించారు. ఇసుక అక్రమ డంపింగ్కి పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి, టాస్క్ ఫోర్స్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తున్న లారీలను పట్టుకోవడం, కేసులు నమోదు చేయడం మొదలైంది. అధికారుల చర్యలతో ఇసుక మాఫియాకు గట్టి ఎదురు దెబ్బ పడే అవకాశం ఉంది.
అక్రమంగా ఇసుక నిల్వలు, రవాణా, విక్రయాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. ఇసుక అక్రమ దందాకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టి, అవసరమైనట్టయితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిజానికి నిర్మాణ రంగం కోసం ఇసుక అత్యవసరమైన వస్తువు. అయితే దాన్ని అక్రమ మార్గాల్లో నిల్వ చేయడం, అధిక ధరలకు విక్రయించడం సామాన్య ప్రజలపై భారం పెడుతోంది. ఇలాంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
తాజావార్తలు
-
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
-
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
-
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!