Saleshwaram Jatara: నేటి నుంచి సలేశ్వరం జాతర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saleshwaram Jatara: తెలంగాణ అమరనాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర నేడు ప్రారంభమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు నల్లమల అభయారణ్యంలోని సళేశ్వరం జాతర జరగనుంది. వస్తున్నాం లింగమయ్యా అంటూ పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. లోయ గుహలో వెలసిన లింగమయ్యను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. అయితే.. గతంలో జరిగిన ప్రమాదాలు, అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా జాతరకు మూడు రోజులు మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 24వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతించనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా పోలీసు, హెల్త్, ఇతరత్రా శాఖల సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది మూడు రోజులు పాటు మాత్రమే జాతరకు అనుమతిని ఇస్తున్నామని చెప్పారు. సలేశ్వరంలో లింగమయ్యను దర్శించుకోవాలంటే భక్తులు కిలోమీటర్ల మేర కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం గుడివద్దకు సాహసయాత్ర చేయాల్సి ఉంటుంది.
Read Also: Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ప్రకృతి రమణీయతను ఆస్వాదించడానికి, పుణ్యక్షేత్రముగా ప్రసిద్ది గాంచిన సలేశ్వరం జాతర పేరుతో సంవత్సరానికి ఒక్కసారే అనుమతి ఇస్తున్నారు. అయితే.. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. దీంతో గుండంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గి ప్రాణనష్టం సంభవిస్తోంది. ఇక నుంచి అలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా మే నెల నుంచి 9 నెలల పాటు రోజుకు 100 మందికి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అనుమతిని ఇస్తామని డీఎఫ్వో వెల్లడించారు. ఈ ప్యాకేజీలో స్థానిక చెంచులకు ఉపాధి కల్పించడం ద్వారా వారే ప్రత్యేక వాహనాల్లో సలేశ్వరం వరకు తీసుకెళ్లి దగ్గర ఉండి దర్శనం చేయిస్తారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!