Electoral Bonds: ఇవాళ్టి నుంచి ఎలక్టోరల్ బాండ్ల విక్రయం ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
30వ విడత ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇవాళ్టి నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల విషయంలో పారదర్శకత తీసుకు వచ్చేందుకు ఈ బాండ్లను ప్రవేశ పెట్టింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మళ్లీ ఈ బాండ్ల సందడి స్టార్ట్ అయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన 29 అధీకృత శాఖల ద్వారా నేటి నుంచి జనవరి 11వ తేదీ వరకు ఎలక్టోరల్ బాండ్లను విక్రయించనుందని ఆర్థిక శాఖ తెలిపింది.
Read Also: Redmi Note 13 5G Series : మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్.. ధర, ఫీచర్స్ ఏంటంటే?
Also Read
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలలో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశ పెట్టారు. ఎలక్టోరల్ బాండ్ల మొదటి విడత మార్చి 2018లో విక్రయించబడింది. ఎలక్టోరల్ బాండ్లను అర్హత కలిగిన రాజకీయ పార్టీ అధీకృత బ్యాంకులో ఉన్న తన బ్యాంక్ ఖాతా ద్వారా మాత్రమే క్యాష్ చేసుకుంటుంది. బెంగళూరు, లక్నో, సిమ్లా, డెహ్రాడూన్, కోల్కతా, గౌహతి, చెన్నై, పాట్నా, న్యూఢిల్లీ, చండీగఢ్, శ్రీనగర్, గాంధీనగర్, భోపాల్, రాయ్పూర్ తో పాటు ముంబైలోని ఎస్బీఐ అధీకృత శాఖల్లో మాత్రమే ఈ బాండ్ల విక్రయం కొనసాగుతుంది.
Read Also: Durga Stotram: మార్గశిర మంగళవారం నాడు ఈ స్తోత్రం వింటే మీకు ఇక తిరుగుండదు
ఇక, ఎలక్టోరల్ బాండ్లు జారీ చేసిన తేదీ నుంచి 15 రోజుల పాటు చెల్లుబాటు అవుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. చెల్లుబాటు వ్యవధి ముగిసిన తర్వాత బాండ్ డిపాజిట్ చేయబడితే, రాజకీయ పార్టీకి చెల్లింపు చేయబడదు అని పేర్కొనింది. గత లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక శాతం ఓట్లను సాధించిన రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు పొందేందుకు అర్హులని మంత్రిత్వ శాఖ చెప్పింది. ఎలక్టోరల్ బాండ్లను భారతీయ పౌరులు లేదా దేశంలో స్థాపించబడిన సంస్థలు కొనుగోలు చేయవచ్చు అని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
తాజావార్తలు
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!