T20 World Cup 2026: సూపర్ 8 ఆడకుండానే సెమీస్లోకి భారత్.. ఎలాగో తెలుస్తే షాక్ అవుతారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: ICC T20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 రౌండ్ స్టార్ట్ అయ్యింది. టీమిండియా ఈ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జింబాబ్వేలతో కలిసి గ్రూప్ 1లో ఉంది. టీమిండియా ఫస్ట్ సూపర్ 8 మ్యాచ్ దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్లో జరుగుతుంది. ఈ సూపర్ 8లో, గ్రూప్ దశ నుంచి ఎటువంటి క్యారీఓవర్ పాయింట్లు ఉండవు. అన్ని జట్లు సున్నా నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ సూపర్ 8లో ప్రతి జట్టు మూడు మ్యాచ్లు ఆడుతుంది, మొదటి రెండు జట్లు సెమీ-ఫైనల్కు చేరుకుంటాయి. ఏదైనా గ్రూప్లోని మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు అయితే, ఆ రెండు జట్లకు ఒకొక్క పాయింట్ లభిస్తుంది. ఈ స్టోరీలో బ్యాట్ పట్టకుండానే భారత్ సెమీస్లోకి ఎలా ప్రవేశిస్తుందో తెలుసుకుందాం.
READ ALSO: Gautam Gambhir: “అరే యార్.. మీరు ఎలా మేనేజ్ చేస్తారు?”.. అభిమానులతో గంభీర్ ఫన్నీ చిట్చాట్ వైరల్
Also Read
- IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
- DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
ఇటీవల మొదటి సూపర్ 8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్ – న్యూజిలాండ్ జట్లకు చెరొక పాయింట్ లభించింది. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, ఏదైనా సూపర్ 8 గ్రూప్లోని అన్ని మ్యాచ్లు వర్షం వల్ల లేదంటే మరేదైనా కారణం వల్ల రద్దు అయితే ఏమి జరుగుతుందనేది. ఈ మెగా టోర్నమెంట్లో అలాంటి పరిస్థితులు ఎదురైతే సూపర్ 8 రౌండ్ తర్వాత అర్హత కోసం ICC వివిధ ప్రమాణాలను నిర్దేశించింది, వాటితో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే సెమీ-ఫైనల్కు చేరుకునే అవకాశం ఉంది. అది ఎలా అంటే..
ఐసిసి నిబంధనల ప్రకారం.. పాయింట్ల పట్టిక ఆధారంగా సెమీ-ఫైనల్ బెర్త్లను నిర్ణయిస్తారు. మొదటి రెండు జట్లు సెమీ-ఫైనల్కు చేరుకుంటాయి. ఆ రెండు జట్టుల పాయింట్లు సమమైతే, సూపర్ 8 రౌండ్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టు ముందుకు వెళ్తుంది. అయితే, మ్యాచ్ల సంఖ్య కూడా సమానం అయితే, నిర్ణయం నెట్ రన్ రేట్ ఆధారంగా ఉంటుంది. నెట్ రన్ రేట్ కూడా సమమైతే, రెండు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించి విజేతగా నిలిచిన జట్టు సెమీ ఫైనల్ బెర్త్కు అర్హత సాధిస్తుంది. కానీ మ్యాచ్లు జరగకపోతే అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది. దానికి సమాధానం ఏమిటంటే.. గ్రూప్ 1 మ్యాచ్లన్నీ వర్షం కారణంగా రద్దయితే, నాలుగు జట్లు చెరో 3 పాయింట్లతో టై అవుతాయి. అప్పుడు ఆ జట్టుల విజయాల సంఖ్య సున్నా అవుతుంది. దీంతో నెక్ట్స్ ఆప్షన్గా నెట్ రన్ రేట్కు వెళ్తారు. కానీ అసలు మ్యాచ్లు జరగకపోవడంతో, NRR కూడా సున్నా అవుతుంది. మ్యాచ్లు జరగకపోవడంతో హెడ్-టు-హెడ్ మ్యాచ్లు కూడా సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో, చివరి టై-బ్రేకర్ ICC T20I ర్యాంకింగ్స్ అవుతుంది. T20I ర్యాంకింగ్స్ విషయానికి వస్తే టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుంది. దీంతో ఈ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే సెమీఫైనల్కు చేరుకోగలదని చెబుతున్నారు.
READ ALSO: PM Modi: కాంగ్రెస్ ఇప్పటికే నగ్నంగా ఉంది, చొక్కాలు విప్పడం దేనికి..
తాజావార్తలు
-
RC 17 : కన్ఫ్యూజన్లో పడేసిన సుకుమార్
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
-
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
-
Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
-
DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!