T20 World Cup 2026: సూపర్ 8 ఆడకుండానే సెమీస్లోకి భారత్.. ఎలాగో తెలుస్తే షాక్ అవుతారు!
T20 World Cup 2026: ICC T20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 రౌండ్ స్టార్ట్ అయ్యింది. టీమిండియా ఈ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జింబాబ్వేలతో కలిసి గ్రూప్ 1లో ఉంది. టీమిండియా ఫస్ట్ సూపర్ 8 మ్యాచ్ దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్లో జరుగుతుంది. ఈ సూపర్ 8లో, గ్రూప్ దశ నుంచి ఎటువంటి క్యారీఓవర్ పాయింట్లు ఉండవు. అన్ని జట్లు సున్నా నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ సూపర్ 8లో ప్రతి జట్టు మూడు మ్యాచ్లు ఆడుతుంది, మొదటి రెండు జట్లు సెమీ-ఫైనల్కు చేరుకుంటాయి. ఏదైనా గ్రూప్లోని మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు అయితే, ఆ రెండు జట్లకు ఒకొక్క పాయింట్ లభిస్తుంది. ఈ స్టోరీలో బ్యాట్ పట్టకుండానే భారత్ సెమీస్లోకి ఎలా ప్రవేశిస్తుందో తెలుసుకుందాం.
READ ALSO: Gautam Gambhir: “అరే యార్.. మీరు ఎలా మేనేజ్ చేస్తారు?”.. అభిమానులతో గంభీర్ ఫన్నీ చిట్చాట్ వైరల్
Also Read
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
ఇటీవల మొదటి సూపర్ 8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్ – న్యూజిలాండ్ జట్లకు చెరొక పాయింట్ లభించింది. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, ఏదైనా సూపర్ 8 గ్రూప్లోని అన్ని మ్యాచ్లు వర్షం వల్ల లేదంటే మరేదైనా కారణం వల్ల రద్దు అయితే ఏమి జరుగుతుందనేది. ఈ మెగా టోర్నమెంట్లో అలాంటి పరిస్థితులు ఎదురైతే సూపర్ 8 రౌండ్ తర్వాత అర్హత కోసం ICC వివిధ ప్రమాణాలను నిర్దేశించింది, వాటితో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే సెమీ-ఫైనల్కు చేరుకునే అవకాశం ఉంది. అది ఎలా అంటే..
ఐసిసి నిబంధనల ప్రకారం.. పాయింట్ల పట్టిక ఆధారంగా సెమీ-ఫైనల్ బెర్త్లను నిర్ణయిస్తారు. మొదటి రెండు జట్లు సెమీ-ఫైనల్కు చేరుకుంటాయి. ఆ రెండు జట్టుల పాయింట్లు సమమైతే, సూపర్ 8 రౌండ్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టు ముందుకు వెళ్తుంది. అయితే, మ్యాచ్ల సంఖ్య కూడా సమానం అయితే, నిర్ణయం నెట్ రన్ రేట్ ఆధారంగా ఉంటుంది. నెట్ రన్ రేట్ కూడా సమమైతే, రెండు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించి విజేతగా నిలిచిన జట్టు సెమీ ఫైనల్ బెర్త్కు అర్హత సాధిస్తుంది. కానీ మ్యాచ్లు జరగకపోతే అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది. దానికి సమాధానం ఏమిటంటే.. గ్రూప్ 1 మ్యాచ్లన్నీ వర్షం కారణంగా రద్దయితే, నాలుగు జట్లు చెరో 3 పాయింట్లతో టై అవుతాయి. అప్పుడు ఆ జట్టుల విజయాల సంఖ్య సున్నా అవుతుంది. దీంతో నెక్ట్స్ ఆప్షన్గా నెట్ రన్ రేట్కు వెళ్తారు. కానీ అసలు మ్యాచ్లు జరగకపోవడంతో, NRR కూడా సున్నా అవుతుంది. మ్యాచ్లు జరగకపోవడంతో హెడ్-టు-హెడ్ మ్యాచ్లు కూడా సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో, చివరి టై-బ్రేకర్ ICC T20I ర్యాంకింగ్స్ అవుతుంది. T20I ర్యాంకింగ్స్ విషయానికి వస్తే టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుంది. దీంతో ఈ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే సెమీఫైనల్కు చేరుకోగలదని చెబుతున్నారు.
READ ALSO: PM Modi: కాంగ్రెస్ ఇప్పటికే నగ్నంగా ఉంది, చొక్కాలు విప్పడం దేనికి..
తాజావార్తలు
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?