వరుస భారీ ప్రాజెక్టులతో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్, తాజాగా తమ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘సలార్ 2’ పై కీలక ప్రకటన చేసింది. ఓ ఇంటర్వ్యూలో నిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించడంతో, రెండో భాగాన్ని అంతకు మించిన స్థాయిలో అత్యంత భారీ చిత్రంగా తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read : Ranabali : పెళ్లి తో వచ్చిన పబ్లిసిటీ… సినిమాకు ఫ్రీ ప్రమోషన్.. పెరిగిన బడ్జెట్
దర్శకుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ మరియు క్వాలిటీ విషయంలో రాజీపడరని.. ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. గతంలో సినిమా ఆలస్యం అవుతుందంటూ వచ్చిన వదంతులను కూడా ఆయన కొట్టిపారేశారు. ప్రశాంత్ నీల్ సెట్ చేసే హై స్టాండర్డ్స్ వల్లే కొంత సమయం తీసుకున్నామని, ప్రభాస్తో హోంబలే ఫిలిమ్స్ కుదుర్చుకున్న మల్టీ-ఫిలిం డీల్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని వెల్లడించారు. ‘కేజీఎఫ్’, ‘కాంతార’ వంటి సినిమాలతో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ, ‘సలార్ 2’తో మరో మైలురాయిని అందుకోవాలని చూస్తోంది. అయితే, బాక్సాఫీస్ దగ్గర భారీ విజాయిన్ని అందుకున్న సలార్ సినిమా.. ఓటీటీ ప్లాట్ఫామ్లలో ఇప్పటికీ ట్రెండింగ్లో ఉండటం విశేషం. అందుకే.. “సలార్ 2”ను అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నట్టుగా నిర్మాత స్పష్టం చేశారు. మొత్తానికి, ‘సలార్ 2’ షూటింగ్ ప్రారంభంపై అధికారిక ప్రకటన రావడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్తో సినిమా చేస్తున్న నీల్.. అది అయిపోయాక సలార్ 2 స్టార్ట్ చేయనున్నాడు.