Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Sajjala Ramakrishna Reddy Said Privatisation Is A Big Scam Not Ppp

Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వం ఉండి ఏం లాభం.. ఇది పీపీపీ కాదు, పెద్ద స్కామ్!

Published Date :December 17, 2025 , 6:02 pm
By Sampath Kumar
  • వైఎస్ జగన్ విజన్‌తో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు
  • ప్రభుత్వ వైద్యశాలలు వస్తే ఆరోగ్యశ్రీ ఖర్చులు తగ్గుతాయని జగన్ భావించారు
  • చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు
  • విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేట్ పరం అయితే ప్రభుత్వం ఉండి ఏం లాభం
Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వం ఉండి ఏం లాభం.. ఇది పీపీపీ కాదు, పెద్ద స్కామ్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మాజీ సీఎం వైఎస్ జగన్ విజన్‌తో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి ఉండాలన్నది సంకల్పించారని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలు వస్తే ఆరోగ్యశ్రీ ఖర్చులు తగ్గుతాయని జగన్ భావించారన్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేట్ పరం అయితే ప్రభుత్వం ఉండి ఏం లాభం అని.. ఇది పీపీపీ కాదు, పెద్ద స్కామ్ అని ఫైర్ అయ్యారు. ఏదైనా ప్రైవేటుకు వెళ్తే ప్రజలకి నష్టమే అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

‘వైఎస్ జగన్ చాలా కృషి చేసి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం అన్యాయంగా ప్రైవేట్ పరం చేస్తానంటుంది. ప్రైవేటుపరం అయిపోతే పేదల పరిస్థితి ఏంటి?. విద్య, వైద్యం పూర్తిగా ప్రవేటు అయిపోతే ప్రభుత్వం ఉండి ఏం లాభం?. ప్రైవేట్ అత్యుత్తమం అని చంద్రబాబు చెప్పడం దారుణం. ప్రైవేట్ వాళ్ళు ఎందుకు సర్వీస్ చేస్తారు?. సొంతగా సర్వీస్ చేస్తే పర్లేదు ప్రభుత్వ ఆస్తులు కట్టబెట్టాక ఏంటి?. ఇది పీపీపీ కాదు పెద్ద స్కాం. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. విభజన తర్వాత ఇంత స్పందన రావడం ఇదే మొదటిసారి. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగ 1.4 కోట్ల సంతకాలు వచ్చాయి. ప్రజల స్పందనకి చంద్రబాబు కొంచం తగ్గారు. ప్రభుత్వ అనే పేరు ఉంటుంది అంటున్నాడు. పేరు ఒక్కటే ఉంటే ఏమి ఉపయోగం.. అన్ని ఇచ్చి ప్రైవేటుకి ఇవ్వడం ఏంటి?. రాష్ట్రంలో చాలా మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ ప్రభుత్వం నడపడం లేదా?. రెండేళ్లు జీతాలు ఇస్తాం అంటున్నారు.. వాటికి అయ్యే ఖర్చుతో కాలేజీలు పూర్తి చెయ్యండి. ఏ విద్యార్థి అయినా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదవాలని కోరుకుంటారు. అవసరం లేకపోయినా చంద్రబాబు ప్రైవేటీకరణను నెత్తిన పెట్టుకున్నాడు’ అని సజ్జల మండిపడ్డారు.

Also Read: CM Chandrababu: జనవరి నుంచి సీఎం చంద్రబాబు ఆకస్మిక పర్యటనలు!

‘సీఎం చంద్రబాబు సిద్ధాంతమే ప్రవేటీకరణ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే. చంద్రబాబు ఇక్కడితో ఆగడు పీహెచ్సీలు కూడా ప్రయివేటుకు ఇస్తాను అంటాడు. చంద్రబాబు రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నాడు. కోటి నాలుగు లక్షల 11 వేల సంతకాలు వచ్చాయి. బ్యాలెట్ బాక్స్ లో ఓటు వేసినట్టే ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజల నిర్ణయాన్ని చంద్రబాబు గౌరవించాలి.. కావాలి అంటే క్రెడిట్ నువ్వే తీసుకో. చంద్రబాబుకి క్రెడిట్ చోరీ చెయ్యడం అలవాటే కదా. చంద్రబాబు ఈ వయసులో ప్రజల ఉసురు పోసుకోవద్దు.. నిర్ణయం మార్చుకో. మిగిలిన రంగాల్లో ప్రైవేటీకరణ వేరు.. మెడికల్ కాలేజీలు వేరు. ఏదైనా ప్రైవేటుకు వెళ్తే ప్రజలకి నష్టమే. రోడ్లు పీపీపీలో జరుగుతున్నాయి, అందుకే టోల్ టాక్స్ భారీగా వసూల్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వస్తుంటే చార్జీల కంటే టోల్ టాక్స్ ఎక్కువ అవుతుంది. ప్రజలు సంతకాలు చేశారో లేదో ప్రజల్లోకి వెళ్లి తెలుసుకోండి. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం మంత్రులకి ఉందా?’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • cm chandrababu
  • CM Chandrababu Sajjala
  • medical colleges
  • Medical Colleges Privatisation

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కారణంగా.. బీసీసీఐకి కొత్త తలనొప్పి స్టార్ట్.. ఎందుకంటే..

  • MI vs PBKS : డికాక్ సెంచరీ వృథా.. పంజాబ్ దెబ్బకు ముంబై కూలింది!

  • Fly Over: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి..

  • Ramavath Madhu : మైక్రో ఫైనాన్స్‌ ఫ్రాడ్‌ కేసులో రమావత్‌ మధు అరెస్టు.

  • Bonus Shares: ఒక షేరు కొంటే.. మరో షేరు ఉచితం.. ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థ..

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions