Sajjala Ramakrishna Reddy: వాలంటరీ వ్యవస్థపై చంద్రబాబుకు కక్ష.. సజ్జల సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: బాబు పాలన అంతా విధ్వంసమేనని, ప్రజలను ఇబ్బంది పెడతారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో మళ్ళీ ఆయన తీరు బయటపడిందన్నారు. వాలంటరీల వ్యవస్థ పై ముందు నుంచే చంద్రబాబు కక్ష పెంచుకున్నారని అన్నారు. ఎన్నికల పేరుతో వాలంటరీ వ్యవస్థను ఆపాలని చంద్రబాబు పరోక్షంగా ఈసీకి ఫిర్యాదు చేశారన్నారు. చంద్రబాబు స్వయంగా చెప్పవచ్చు.. వాలంటరీ వ్యవస్థ మంచిది కాదు అని.. జన్మభూమి కమిటీలు తెస్తామని.. కానీ ఇలా చంద్రబాబు దొంగ దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. వాలంటరీ వ్యవస్థపై చంద్రబాబు, దత్తపుత్రుడు ఆలోచన ఏంటో అందరికీ తెలుసన్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థను చంద్రబాబు పెట్టించారన్నారు. వాలంటరీల వ్యవస్థతో జగన్కు మేలు చేస్తారని చంద్రబాబు ఆలోచన అని.. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇప్పుడు లేఖలు రాయడం మొదలు పెట్టారన్నారు.
Read Also: CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి..
Also Read
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
- Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
- Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
సిటిజన్ ఫర్ డెమోక్రసి అనే సంస్థ వాలంటరీ వ్యవస్థపై సుప్రీం కోర్టుకు వెళ్లిందన్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసి సంస్థను రమేష్ కుమార్ నడిపిస్తున్నారని.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి చంద్ర బాబు, టీడీపీ ఏజెంట్ అని ఆరోపించారు. నాలుగేళ్లుగా పింఛన్ను ప్రతి నెలా ఒకటవ తేదీన ఇచ్చేవారు వాలంటీర్లు అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక వేళ తప్పుదారి చంద్రబాబు అధికారంలోకీ వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీల అరాచకం ఉంటుందని విమర్శించారు. జగన్ పాదయాత్రలో ప్రజలు చెప్పిన సమస్యలను అధిగమించేందుకు వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. ప్రజలకు ఎదైనా చేయాలనుకునే ఎవరికైనా వాలంటరీ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. వాలంటరీ వ్యవస్థతో గ్రామాల రూపు రేఖలు మారిపోయాయన్నారు. ఓట్ల కోసం వ్యవస్థలను పెట్టే వ్యక్తి చంద్రబాబు అని.. జగన్ పెట్టిన వాలంటరీ వ్యవస్థ జనంకు మంచి చేసిందన్నారు. చంద్రబాబు కడుపు మంటతో ప్రజలకు అందే సేవలను నిలిపివేశారన్నారు.
Read Also: PM Modi: కీలమైన ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిన కాంగ్రెస్.. ఆ పార్టీని నమ్మలేం..
ఇప్పుడు పెన్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని మళ్లీ చంద్రబాబు సీఎస్కు లేఖ రాశారన్నారు. పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందన్నారు. చంద్రబాబు సిటిజన్ ఫర్ డెమోక్రసి అనే సంస్థ ద్వారా వాలంటరీ వ్యవస్థను అడ్డుకున్నారని మండిపడ్డారు. పెన్షన్లు ఆలస్యంగా రావడానికి చంద్ర బాబు కారణం అని ప్రజలు గుర్తించాలన్నారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎటు కాకుండా అయ్యిందన్నారు. పవన్ ఇక్కడే ఉంటా అని పిఠాపురంలో దీనంగా చెబుతున్నారన్నారు. జనసేనలో పోటీ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది చంద్రబాబు పంపిన వాళ్లేనన్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసి సంస్థకు టీడీపీ, జనసేనలు రెండూ ఒక్కటేనన్నారు. బీజేపీ అభ్యర్థులు బయట నుంచి వచ్చిన వారు.. చంద్రబాబు పంపిన వాళ్లేనన్నారు. సొంత పార్టీ నేతల్ని చెడుగుడు ఆడారు చంద్రబాబు.. డబ్బుల కోసం చంద్రబాబు టికెట్లు ఇచ్చారన్నారు. వైసీపీ బీసీలకు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!