Sajjala Ramakrishna Reddy: జగన్పై దాడి.. పిరికిపందల చర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్పై దాడి దారుణమని.. దాడిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. . సీఎం జగన్పై రాళ్ల దాడికి పాల్పడ్డారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మండిపడ్డారు. దాడికి ఎయిర్గన్ ఉపయోగించి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఆకతాయిలు చేసిన పని కాదు.. పక్కా ప్లాన్తో చేశారన్నారు. భద్రతా వైఫల్యం అంటూ మాట్లాడుతున్నారు.. దాడిని నటన అంటున్నారు.. ఎవరైనా తమపై తామే ఇలాంటి దాడి చేయించుకుంటారా అంటూ సజ్జల ప్రశ్నించారు. కడుపునకు అన్నం తినేవారు ఎవరైనా ఇలా మాట్లాడరని సజ్జల మండిపడ్డారు. అసలు నటించేది ఎవరో అందరికీ తెలుసన్నారు. కొంచెం పక్కకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం జరిగేదని.. కొంచెం కిందకు తగిలిఉంటే కన్ను పోయేదని ఆయన చెప్పారు. ఈ ఘటనలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తీవ్రంగా గాయపడ్డారన్నారు.
Read Also: Kodali Nani: సీఎం జగన్పై దాడి.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
ఇది సాధారణంగా జరిగిన ఘటన కాదని.. ఇది కోల్డ్ బ్లడెడ్ పక్కా ప్లాన్ మర్డర్ అటెంప్ట్ అని ఆయన అనుమానించారు. ప్రతీ చోట చంద్రబాబు రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారన్న సజ్జల.. ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. . దేవుడు, ప్రజలు ఆశీస్సులతో జగన్ క్షేమంగా ఉన్నారన్నారు. వైద్యుల సలహా మేరకు ఇవాళ విరామం తీసుకున్నారని.. నటన చంద్రబాబుకు అలవాటు. నటించాల్సిన అవసరం జగన్కు లేదన్నారు. జగన్పై దాడిని ఎగతాళి చేస్తున్నారు…అసలు మీరు మనుషులేనా అంటూ మండిపడ్డారు. జగన్ యాత్ర వల్ల నష్ట పోయె వాళ్ళదే ఈ చర్యగా అనిపిస్తుందన్నారు. జగన్ పై దాడి తీవ్రమైన హత్య ప్రయత్నంగా చూస్తున్నామన్నారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ..” అదృష్టం, దేవుడి ఆశీస్సులతో జగన్ క్షేమంగా ఉన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ హత్యాప్రయత్నం జరిగింది. జగన్ బస్సు యాత్ర రేపటి నుంచి కొనసాగుతుంది. మాకు నాటకాలు చేసి ప్రజల సానుభూతి తెచ్చుకోవాలన్న ఆలోచన లేదు. అలిపిరి ఘటనతో చంద్ర బాబు సానుభూతి కోసం ప్రయత్నాలు చేసి …విఫలం అయ్యారు. చంద్ర బాబు స్కూల్లో ఉన్న వారికి నెగిటివ్ లక్షణాలు ఉంటాయి. జరిగిన ఘటనకు బాధ్యత టీడీపీదే.” అని సజ్జల పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!