Sajjala Ramakrishna Reddy: జగన్పై దాడి.. పిరికిపందల చర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్పై దాడి దారుణమని.. దాడిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. . సీఎం జగన్పై రాళ్ల దాడికి పాల్పడ్డారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మండిపడ్డారు. దాడికి ఎయిర్గన్ ఉపయోగించి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఆకతాయిలు చేసిన పని కాదు.. పక్కా ప్లాన్తో చేశారన్నారు. భద్రతా వైఫల్యం అంటూ మాట్లాడుతున్నారు.. దాడిని నటన అంటున్నారు.. ఎవరైనా తమపై తామే ఇలాంటి దాడి చేయించుకుంటారా అంటూ సజ్జల ప్రశ్నించారు. కడుపునకు అన్నం తినేవారు ఎవరైనా ఇలా మాట్లాడరని సజ్జల మండిపడ్డారు. అసలు నటించేది ఎవరో అందరికీ తెలుసన్నారు. కొంచెం పక్కకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం జరిగేదని.. కొంచెం కిందకు తగిలిఉంటే కన్ను పోయేదని ఆయన చెప్పారు. ఈ ఘటనలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తీవ్రంగా గాయపడ్డారన్నారు.
Read Also: Kodali Nani: సీఎం జగన్పై దాడి.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ఇది సాధారణంగా జరిగిన ఘటన కాదని.. ఇది కోల్డ్ బ్లడెడ్ పక్కా ప్లాన్ మర్డర్ అటెంప్ట్ అని ఆయన అనుమానించారు. ప్రతీ చోట చంద్రబాబు రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారన్న సజ్జల.. ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. . దేవుడు, ప్రజలు ఆశీస్సులతో జగన్ క్షేమంగా ఉన్నారన్నారు. వైద్యుల సలహా మేరకు ఇవాళ విరామం తీసుకున్నారని.. నటన చంద్రబాబుకు అలవాటు. నటించాల్సిన అవసరం జగన్కు లేదన్నారు. జగన్పై దాడిని ఎగతాళి చేస్తున్నారు…అసలు మీరు మనుషులేనా అంటూ మండిపడ్డారు. జగన్ యాత్ర వల్ల నష్ట పోయె వాళ్ళదే ఈ చర్యగా అనిపిస్తుందన్నారు. జగన్ పై దాడి తీవ్రమైన హత్య ప్రయత్నంగా చూస్తున్నామన్నారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ..” అదృష్టం, దేవుడి ఆశీస్సులతో జగన్ క్షేమంగా ఉన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ హత్యాప్రయత్నం జరిగింది. జగన్ బస్సు యాత్ర రేపటి నుంచి కొనసాగుతుంది. మాకు నాటకాలు చేసి ప్రజల సానుభూతి తెచ్చుకోవాలన్న ఆలోచన లేదు. అలిపిరి ఘటనతో చంద్ర బాబు సానుభూతి కోసం ప్రయత్నాలు చేసి …విఫలం అయ్యారు. చంద్ర బాబు స్కూల్లో ఉన్న వారికి నెగిటివ్ లక్షణాలు ఉంటాయి. జరిగిన ఘటనకు బాధ్యత టీడీపీదే.” అని సజ్జల పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!