Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు గెస్ట్హౌస్ అటాచ్.. సజ్జల కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు చెందిన గెస్ట్ హౌస్ ని ఏపీ గవర్నమెంట్ అటాచ్ చేసిన విషయం విదితమే.. క్రిమినల్ లా అమెండ్ మెంట్ 1944 చట్టం ప్రకారం ప్రాపర్టీని అటాచ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, నారాయణ తమ పదవులను దుర్వినియోగపరిచి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణలో భాగంగా చర్యలు చేపట్టారు.. కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా పొందారని చంద్రబాబుపై అభియోగాలు మోపారు.. చట్టాలను ఉల్లంఘించినట్టు విచారణలో తేలిందంటున్నారు.. అయితే, సీఐడీ అటాచ్మెంట్ పై స్పందించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. నేను నిలబడి ఉన్న ఈ ప్రాంతం కూడా మాయా వేదికే.. అక్రమాలకు చిరునామా కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇల్లు.. ఆ అక్రమ కట్టడంలో చంద్రబాబు ఏ హోదాలో ఉంటున్నారో అర్థం కాదన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఇంటి అలవెన్సు పొందుతున్నారు.. కానీ, ఎక్కడా అద్దెకు తీసుకున్నట్లు ఒప్పందాలు లేవన్నారు సజ్జల.. లింగమనేని రమేష్ ఆ ఇంటిని దేశభక్తితో ప్రభుత్వానికి ఇచ్చినట్లు కోర్టుకు చెప్పారన్న ఆయన.. మరి చంద్రబాబు అధికారం పోయిన తర్వాత కూడా అదే ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నారు? అని నిలదీశారు.. పేదల, ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని.. కపటత్వానికి చంద్రబాబు ప్రతినిధి అని ఆరోపించారు. ఒక వైపు ప్రజల కోసం నిలబడే వైసీపీ, మరోవైపు పెత్తందారీ స్వభావం ఉన్న చంద్రబాబు, జనసేన, వారి మీడియా ఉంది.. ఈ కుట్రల పట్ల మనం అందరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read
ఇక, రాజకీయ ఆట నిబంధనలను మార్చిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని ప్రశంసించారు సజ్జల.. గడప గడపకు వెళుతున్నప్పుడు ప్రజల నుంచి మంచి అభిమానం వ్యక్తం అవుతోందన్నారు.. ప్రతిపక్షాలకు అర్హత లేదు.. తోడేళ్ల మందలా ఏకమై దాడి చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. మాయా మారిచ శక్తుల్లా వ్యవహరిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇది ఎక్కువ అవుతోందన్నారు. కోటి 60 లక్షల కుటుంబాలు సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందాయి.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజకీయం అంటే ఎత్తులు, పొత్తులతో కాదు.. ప్రజలకు ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేయాలని.. అమలు చేయలేకపోతే ధైర్యంగా ఒప్పుకోగలగాలని హితవు పలికారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
తాజావార్తలు
-
Story Board : పంజా విసురుతున్న ఎల్నినో.. ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం..
-
USA: “నువ్వు ముస్లింవా?” అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
-
India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
-
Tragedy: దమ్ముంటే హైదరాబాద్కు రమ్మన్నాడు.. నిజంగానే వచ్చి చంపేశారు.. ఏం జరిగిందంటే..
-
Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!