Sajjala Ramakrishna Reddy: రాజధాని విషయంలో మాకు స్పష్టమైన వైఖరి ఉంది.. క్లారిటీ ఇచ్చిన సజ్జల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో పాలక, ప్రతిపక్షాల మాట యుద్ధం నడుస్తూనే ఉంది.. అయితే, రాజధాని విషయంలో తమ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతంపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో దిశానిర్దేశం చేశారు. అయితే, అమరావతి పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాశ్వతంగా దోపిడీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే, మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని గ్రోత్ కారిడార్గా అభివృద్ధి చేస్తూ మెగా సిటీగా తీర్చిదిద్దాలనే ఆలోచనను వివరించారు.
Read Also: Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త.. రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
తక్కువ ఖర్చుతో రియల్ క్యాపిటల్ సాధ్యమవుతుందని, అమరావతి ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంపై భారీ అప్పుల భారం పడుతోందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలను గ్రామగ్రామానికి తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు సూచించారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇక, తిరుమల అంశంపై కూడా ఆయన స్పందించారు. తిరుమల పవిత్రత రోజురోజుకీ దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏప్రిల్ 4న రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
మరోవైపు, పార్టీ బలోపేతంపై మాట్లాడుతూ, కమిటీల నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని తెలిపారు సజ్జల. మొత్తం 18 లక్షల క్రియాశీల సభ్యత్వం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 13 లక్షల సభ్యుల డేటా సేకరించినట్లు చెప్పారు. త్వరలో సభ్యులకు ఐడీ కార్డుల ముద్రణ, పంపిణీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా గ్రామస్థాయిలో ప్రచారాన్ని మరింత పెంచాలని, ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. బీఎల్వోలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని, కొత్త ఓటర్ల నమోదు జాగ్రత్తగా చేపట్టాలని అన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!