SA vs IND: పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా.. మూడో టీ20 భారత్దే!
- తిలక్ వర్మ మెరుపు సెంచరీ
- అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ
- యాన్సెన్ సంచలన ఇన్నింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాలుగు టీ20ల సిరీస్లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. 220 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా 7 వికెట్లకు 208 పరుగులు చేయడంతో టీమిండియా 11 పరుగుల తేడాతో నెగ్గింది. ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్ (41; 22 బంతుల్లో 1×4, 4×6), మార్కో యాన్సెన్ (54; 17 బంతుల్లో 4×4, 5×6) సంచలన బ్యాటింగ్తో కంగారెత్తించినా.. చివరికి భారతే పైచేయి సాధించింది. ఈ విజయంతో సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి టీ20 శుక్రవారం జరుగుతుంది.
ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోరు చేసింది. సంజూ శాంసన్ డకౌట్ అయినా.. అభిషేక్ శర్మ (50; 25 బంతుల్లో 3×4, 5×6), తిలక్ వర్మ (107 నాటౌట్; 56 బంతుల్లో 8×4, 7×6)ల మెరుపులతో భారత్ స్కోర్ పరుగులు పెట్టింది. బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన తిలక్.. దక్షిణాఫ్రికా బ్యాటర్లపై దాడి చేశాడు. దాంతో పవర్ ప్లే ముగిసేసరికే భారత్ 70/1తో నిలిచింది. భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్న భారత్కు షాక్ తగిలింది. అభిషేక్తో పాటు సూర్యకుమార్ (1) వరుస ఓవర్లలో నిష్క్రమించగా.. హార్దిక్ పాండ్యా (18) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. రమణ్దీప్ (15; 6 బంతుల్లో 1×4, 1×6) అండతో తిలక్ రేచిపోయి సెంచరీ చేశాడు.
Also Read
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
ఛేదనలో దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభమే దక్కింది. రికిల్టన్ (20), హెండ్రిక్స్ (21) వేగంగా ఆడినా.. త్వరగా అవుట్ అయ్యారు. స్టబ్స్ (12), మార్క్రమ్ (29)ని భారత బౌలర్లు కుదురుకోనివ్వలేదు. దాంతో 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా 4 వికెట్లను 84 రన్స్ చేసింది. ఈ సమయంలో క్లాసెన్ సిక్స్లతో చెలరేగిపోయాడు. దాంతో 15 ఓవర్లకు స్కోరు 134/4గా నిలిచింది. చివరి 5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 86 పరుగులు చేయాల్సి ఉన్నా క్లాసెన్ దూకుడు భారత్ను కలవరపెట్టింది. 19వ ఓవర్లో హార్దిక్ 30 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికాకు 25 పరుగులు అవసరం కాగా.. ఆర్ష్దీప్ చక్కగా బౌలింగ్ చేశాడు.
తాజావార్తలు
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!