Vishwakarma Scheme: విశ్వకర్మ యోజనకు కేంద్రం ఆమోదం.. వారికి రాయితీపై రుణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwakarma Scheme: నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA).. కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన “పీఎం విశ్వకర్మ”కు ఆమోదం తెలిపింది. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి ప్రకటించిన ఈ పథకం ద్వారా 30 లక్షల మంది హస్తకళాకారులు, వారి కుటుంబాలకు రాయితీపై వడ్డీ రేటుతో పూచీకత్తు రహిత రుణాలను అందించడం ద్వారా ప్రయోజనం అందిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.2028 వరకు ఐదు సంవత్సరాల కాలానికి రూ.13,000 కోట్ల ఆర్థిక వ్యయంతో కూడిన ఈ పథకం, మొదటి సందర్భంలో 18 సంప్రదాయ వ్యాపారాలను కవర్ చేస్తుంది. పథకంలో భాగంగా రూ.1 లక్ష వరకు రుణ సదుపాయాన్ని కల్పించనున్నారు. దీనిపై గరిష్టంగా 5 శాతం వడ్డీని విధించనున్నారు. విశ్వకర్మ యోజన పథకానికి రూ.13 వేల కోట్ల నిధులను వెచ్చించనున్నారు. ఈ పథకం వల్ల దేశంలో 30 లక్షల మంది చేతివృత్తుల కళాకారులకు లబ్ధి చేకూరనుంది. “పీఎం విశ్వకర్మ” పథకం కింద మొదటి దశలో కవర్ చేయబడిన వారిలో వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, కమ్మరి, తాళాలు చేసేవారు, స్వర్ణకారులు, కుమ్మరులు, శిల్పులు, చెప్పులు కుట్టేవారు, తాపీ పని చేసేవారు ఉన్నారు.
Also Read: New Rules: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్రం కొత్త రూల్స్..!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
చేతివృత్తులు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారి కోసం ఈ పథకం కింద రెండు శిక్షణ కార్యక్రమాలను తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న వారికి రోజుకు రూ.500 ఉపకార వేతనంతో మెరుగైన శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. శిక్షణ తర్వాత పరికరాల కొనుగోలు కోసం రూ.15వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత వడ్డీపై రాయితీతో తొలుత రూ.లక్ష రుణం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తొలి విడత సద్వినియోగం చేసుకుంటే రెండో విడత కింద రూ.2లక్ష రుణం మంజూరు చేయనున్నట్లు తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబరు 17 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
Read Also: Kota: కోటాలో రాలిపోతున్న విద్యార్థులు.. మరో విద్యార్థి ఆత్మహత్య
ఈ సమావేశంలో ‘‘పీఎం ఈ బస్ సేవ’’కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.57 వేల కోట్ల మొబిలిటీ ఫండ్ కేటాయించారు. 169 నగరాలు, పట్టణాలకు 10 వేల ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించడంతో పాటు రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. డిజిటల్ ఇండియా పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం రూ.14,903 కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద 2.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులకు నైపుణ్యాలను మెరుగుపర్చనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు దేశంలో రైల్వే లైన్ల విస్తరణ, రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించడం, రద్దీని తగ్గించడం కోసం ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.32,500కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించనుంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!