Nandyal: సర్కార్ ఖజానాకే గండి కొట్టారుగా.. రూ.1.50 కోట్ల జీతాల గోల్మాల్.. ముగ్గురు అధికారులు సస్పెండ్..!
- నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో భారీ జీతాల గోల్మాల్ వెలుగులోకి
- అహోబిలం, నరసాపురం పీహెచ్సీ సిబ్బంది జీతాల్లో సుమారు రూ.1.50 కోట్ల అవకతవకలు
- ప్రత్యేక ఆడిట్లో అక్రమాలు నిర్ధారణ
- అహోబిలం పీహెచ్సీ యుడిసి ఇంతియాజ్ అలీ ఖాన్ కీలక పాత్ర
- సమీప బంధువుల పేర్లతో నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandyal: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో భారీ ఆర్థిక అవకతవకలు వెలుగుచూశాయి. అహోబిలం, నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) సిబ్బంది జీతాల విషయంలో దాదాపు రూ.1.50 కోట్ల మేర గోల్మాల్ జరిగినట్లు ఆడిట్లో తేలింది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు సబ్ ట్రెజరీ అధికారులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
అహోబిలం పీహెచ్సీకి చెందిన యుడిసి ఇంతియాజ్ అలీ ఖాన్ తన సమీప బంధువుల పేర్లతో పలు నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఖాతాలకు సంబంధించి ఫేక్ ఐడీలను సృష్టించి, జీతభత్యాల కోసం డీడీఓ సంతకాలతో బిల్లులను సబ్ ట్రెజరీకి పంపినట్లు అధికారులు గుర్తించారు. నలుగురు ఉద్యోగులకు ఒకే బ్యాంకు ఖాతా ఉన్నప్పటికీ, దాన్ని గమనించకుండా సబ్ ట్రెజరీ అధికారులు, డీడీఓలు సంతకాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నకిలీ ఖాతాల్లో జమ అయిన జీతాలను ఇంతియాజ్ అలీ ఖాన్ గత ఐదేళ్లుగా డ్రా చేసుకున్నట్లు సమాచారం. ఈ గోల్మాల్లో సబ్ ట్రెజరీతో పాటు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన కొందరు అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం బయటకు రావడంతో ఉన్నతాధికారులు ప్రత్యేక ఆడిట్ నిర్వహించి అక్రమాలను నిర్ధారించారు.
Kishan Reddy: లోపల జరిగిందొకటి, బయట ప్రచారం చేసింది ఒకటి.. కేంద్రమంత్రి సీరియస్..!
ఈ కేసులో భాగంగా సబ్ ట్రెజరీ అధికారి సుశీల, సీనియర్ అసిస్టెంట్ వెంకటరావు, పద్మలతలపై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే మరో ముగ్గురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
-
Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?