Nandyal: సర్కార్ ఖజానాకే గండి కొట్టారుగా.. రూ.1.50 కోట్ల జీతాల గోల్మాల్.. ముగ్గురు అధికారులు సస్పెండ్..!
- నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో భారీ జీతాల గోల్మాల్ వెలుగులోకి
- అహోబిలం, నరసాపురం పీహెచ్సీ సిబ్బంది జీతాల్లో సుమారు రూ.1.50 కోట్ల అవకతవకలు
- ప్రత్యేక ఆడిట్లో అక్రమాలు నిర్ధారణ
- అహోబిలం పీహెచ్సీ యుడిసి ఇంతియాజ్ అలీ ఖాన్ కీలక పాత్ర
- సమీప బంధువుల పేర్లతో నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandyal: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో భారీ ఆర్థిక అవకతవకలు వెలుగుచూశాయి. అహోబిలం, నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) సిబ్బంది జీతాల విషయంలో దాదాపు రూ.1.50 కోట్ల మేర గోల్మాల్ జరిగినట్లు ఆడిట్లో తేలింది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు సబ్ ట్రెజరీ అధికారులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
Also Read
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
- DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
- Supreme Court: వేధించడానికే పెళ్లిళ్లు చేసుకుంటారా? అబ్బాయిలకు సుప్రీంకోర్టు చీవాట్లు
అహోబిలం పీహెచ్సీకి చెందిన యుడిసి ఇంతియాజ్ అలీ ఖాన్ తన సమీప బంధువుల పేర్లతో పలు నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఖాతాలకు సంబంధించి ఫేక్ ఐడీలను సృష్టించి, జీతభత్యాల కోసం డీడీఓ సంతకాలతో బిల్లులను సబ్ ట్రెజరీకి పంపినట్లు అధికారులు గుర్తించారు. నలుగురు ఉద్యోగులకు ఒకే బ్యాంకు ఖాతా ఉన్నప్పటికీ, దాన్ని గమనించకుండా సబ్ ట్రెజరీ అధికారులు, డీడీఓలు సంతకాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నకిలీ ఖాతాల్లో జమ అయిన జీతాలను ఇంతియాజ్ అలీ ఖాన్ గత ఐదేళ్లుగా డ్రా చేసుకున్నట్లు సమాచారం. ఈ గోల్మాల్లో సబ్ ట్రెజరీతో పాటు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన కొందరు అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం బయటకు రావడంతో ఉన్నతాధికారులు ప్రత్యేక ఆడిట్ నిర్వహించి అక్రమాలను నిర్ధారించారు.
Kishan Reddy: లోపల జరిగిందొకటి, బయట ప్రచారం చేసింది ఒకటి.. కేంద్రమంత్రి సీరియస్..!
ఈ కేసులో భాగంగా సబ్ ట్రెజరీ అధికారి సుశీల, సీనియర్ అసిస్టెంట్ వెంకటరావు, పద్మలతలపై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే మరో ముగ్గురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
-
Romanchakam: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. ‘రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం!
-
Moinuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
-
Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
-
DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!