Chandrayaan-3: విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్రను సృష్టించింది. జాబిల్లి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా దిగింది. బుధవారం అంటే ఆగస్టు 23 భారతదేశానికి, ప్రపంచానికి చారిత్రాత్మకమైన రోజు. ల్యాండ్ అయిన రెండు గంటల 26 నిమిషాల తర్వాత రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండర్ ‘విక్రమ్’ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆరు చక్రాల రోబోటిక్ వాహనం ప్రజ్ఞాన్ రోవర్ తన మిషన్ను నిర్వహిస్తుంది. చంద్రుడిపై తిరుగుతూ డేటాను విక్రమ్ ల్యాండర్కు చేరవేస్తుంది. ఆ ల్యాండర్ బెంగళూరులోని రీసెర్చ్ సెంటర్కు ఆ సమాచారాన్ని చేరవేస్తుందని తెలుస్తోంది. నిర్భయమైన అన్వేషకుడిలా ప్రజ్ఞాన్ చంద్రుని ఉపరితలంపై దిగి, చెరగని గుర్తును వదిలివేస్తాడు. ఈ ముద్ర ఇస్రో లోగో, భారతదేశ చిహ్నంతో అలంకరించబడిన పాదముద్రలుగా ఉంటుంది. చంద్రుని అన్వేషణలో భారతదేశ ప్రవేశానికి చిహ్నం, ఇది శాశ్వతంగా ఉంటుంది. విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత, ఉత్తేజకరమైన శాస్త్రీయ ఆవిష్కరణలు, అపూర్వమైన విజయాలను వాగ్దానం చేస్తూ ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణం ప్రారంభమవుతుంది.
Read Also: Chandrayaan-3: చంద్రయాన్-3 విజయం.. ఇస్రోకు స్పేస్ ఏజెన్సీల అభినందనలు
Also Read
విశేషమేమిటంటే భారతదేశానికి ఆగస్టు 23 బుధవారం ఎప్పటికీ మరచిపోలేని చారిత్రాత్మక దినంగా మారింది. అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టిస్తూ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్ ‘విక్రమ్’, రోవర్ ‘ప్రజ్ఞాన్’తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ను విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ప్రస్తుతం చంద్రుడిపై దిగిన ల్యాండర్ సూర్యరశ్మి ఆధారంగా పనిచేస్తోంది. కాబట్టి.. చంద్రుడి కాలమానం ప్రకారం ఒక రోజు మాత్రమే ( మన లెక్కలో 14 రోజులు) కార్యకలాపాలు నిర్వహించగలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, మరుసటి రోజు సూర్యోదయం తరువాత (14 రోజుల తర్వాత) రోవర్ పునరుజ్జీవం పొందే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు.
జాబిల్లి దక్షిణ ధ్రువంపై తొలిసారిగా అడుగుపెట్టిన భారత్పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రయాన్ 3 విజయం పట్ల భారత సంతతి ప్రజలతో పాటు యావత్ ప్రపంచం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇతర దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు సైతం ఇస్రోకు అభినందనలు తెలిపాయి. ఇస్రోకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శుభాకాంక్షలు తెలిపింది. సోషల్ మీడియా ట్విటర్ వేదికగా నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘చంద్రయాన్-3 విజయవంతమైనందుకు ఇస్రోకు శుభాకాంక్షలు, చంద్రుడిపై వ్యోమనౌకను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. ఈ మిషన్లో మీతో భాగస్వాములైనందుకు మాకు ఆనందంగా ఉంది’’ అని బిల్ నెల్సన్ ట్వీట్ చేశారు. మరోవైపు చంద్రయాన్ 3 విజయం పట్ల బ్రిటన్ అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా అభినందనలు తెలిపింది.
తాజావార్తలు
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
-
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!