Chandrayaan-3: చంద్రయాన్-3 విజయం.. ఇస్రోకు స్పేస్ ఏజెన్సీల అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan-3: జాబిల్లి దక్షిణ ధ్రువంపై తొలిసారిగా అడుగుపెట్టిన భారత్పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రయాన్ 3 విజయం పట్ల భారత సంతతి ప్రజలతో పాటు యావత్ ప్రపంచం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇతర దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు సైతం ఇస్రోకు అభినందనలు తెలిపాయి. ఇస్రోకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శుభాకాంక్షలు తెలిపింది. సోషల్ మీడియా ట్విటర్ వేదికగా నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘చంద్రయాన్-3 విజయవంతమైనందుకు ఇస్రోకు శుభాకాంక్షలు, చంద్రుడిపై వ్యోమనౌకను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. ఈ మిషన్లో మీతో భాగస్వాములైనందుకు మాకు ఆనందంగా ఉంది’’ అని బిల్ నెల్సన్ ట్వీట్ చేశారు. మరోవైపు చంద్రయాన్ 3 విజయం పట్ల బ్రిటన్ అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా అభినందనలు తెలిపింది.
Read Also: ISRO: ఇస్రోలో కొత్త జోష్.. కొత్త ప్రయోగాలు ఇవే..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
చంద్రయాన్-3 విజయంపై నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహల్.. భారత ప్రధాని, ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఈ రోజు అంతరిక్ష పరిశోధన చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఆ దేశ విదేశాంగ మంత్రి ఎన్పీ సౌద్ కూడా ఇస్రోకు అభినందనలు తెలిపారు. చంద్రయాన్-3 ప్రయోగంపై అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్ సీఈఓ ముఖేశ్ అగి ప్రశంసలు కురిపించారు. భారత ప్రజలకు ఇది ఎంతో చారిత్రక సంఘటన అని కొనియాడారు. మానవులకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడానికి చేసే ప్రయత్నాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
చంద్రయాన్-3 విజయంతో భారత్ అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి అత్యంత సమీపంలో వ్యోమనౌకను దింపిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది భారత్. అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ తరువాత విజయవంతంగా జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశంగా భారత్ నిలిచింది. ప్రస్తుతం చంద్రుడిపై దిగిన ల్యాండర్ సూర్యరశ్మి ఆధారంగా పనిచేస్తోంది. కాబట్టి.. చంద్రుడి కాలమానం ప్రకారం ఒక రోజు మాత్రమే ( మన లెక్కలో 14 రోజులు) కార్యకలాపాలు నిర్వహించగలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, మరుసటి రోజు సూర్యోదయం తరువాత (14 రోజుల తర్వాత) రోవర్ పునరుజ్జీవం పొందే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు.
Congratulations @isro on your successful Chandrayaan-3 lunar South Pole landing! And congratulations to #India on being the 4th country to successfully soft-land a spacecraft on the Moon. We’re glad to be your partner on this mission! https://t.co/UJArS7gsTv
— Bill Nelson (@SenBillNelson) August 23, 2023
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..